ప్రపంచంలోనే అరుదైన పులుల జాతి రాయల్ బెంగాల్ టైగర్. అడవులతో పాటు దేశంలోని ప్రముఖ జంతు ప్రదర్శనశాలల్లో ఇవి ఎక్కువగానే ఉన్నాయి. హైదరాబాద్ నెహ్రూ జులాజికల్ పార్క్ లో కూడా ఈ జాతి పులులు ఉన్నాయి. వీటిలో ఒక పులి మృతి చెందడం జంతు ప్రేమికులను విషాదంలోకి నెట్టింది. శనివారం రాత్రి 11ఏళ్ల వయసున్న కదంబ అనే రాయల్ బెంగాల్ టైగర్ మృతి చెందింది.
ఈ పులిని 2014లో కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులోని పిలికుల జూపార్క్ నుంచి తీసుకొచ్చారు. అప్పటి నుంచి హైదరాబాద్ లోని జంతు ప్రేమికులను అలరిస్తోంది కదంబ. అయితే.. కొన్ని రోజులుగా కదంబ యాక్టివ్ గా ఉండటం లేదు. కదంబలో అనారోగ్య సమస్యలు కూడా ఏమీ కనపడలేదని జూ అధికారులు అంటున్నారు. కొన్ని రోజులుగా ఆహారం మాత్రం తీసుకోకపోవటంతో ప్రత్యేక దృష్టి సారించారు. కానీ.. హఠాత్తుగా శనివారం కదంబ మృతి చెందింది. మృతి చెందిన కదంబకు జరిగిన పోస్ట్ మార్టమ్ లో గుండె జబ్బుతో మృతి చెందినట్టు తెలిసిందని అధికారులు అంటున్నారు.
కదంబ మృతిలో ఇతర అనారోగ్య సమస్యలేమన్నా ఉన్నాయా అనే అనుమానంతో రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపామని జూ అధికారులు తెలిపారు. కదంబ చనిపోవడంతో ప్రస్తుతం నెహ్రూ జులాజికల్ పార్క్ లో 11 రాయల్ బెంగాల్ టైగర్స్ తోపాటు.. 9 తెలుగు రంగు రాయల్ బెంగాల్ టైగర్స్ ఉన్నాయి.
403957 967946But wanna say that this is very useful , Thanks for taking your time to write this. 143278
484504 20605Outstanding post, I conceive individuals should larn a lot from this weblog its very user friendly . 9043
832810 636680Cool post thanks! We think your articles are wonderful and hope far more soon. We really like anything to do with word games/word play. 541765