రోజురోజుకీ మనస్తాపానికి గురై హత్యలు చేయడం లేదా తమని తాము చంపేసుకోవడం లాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలో ఉన్న సుదర్శన్ రెడ్డి నగర్ లో భార్య విషయంలో మనస్తాపానికి గురైన ఒక భర్త నడిరోడ్డులో తనపై తానే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు.
అసలు అతను అంత దారుణానికి ఎందుకు పూనుకున్నాడు అనే విషయంలోకి వెళితే.. భువన్ అనే 30 ఏళ్ళ వ్యక్తి తన భార్య, కుమార్తెతో కలిసి సుదర్శన్ రెడ్డి నగర్లో నివాసం ఉంటున్నారు. భువన్ ఓ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తుంటే, భార్య ఇంట్లోనే బ్యూటీ పార్లర్ నడిపేది. వీరిద్దరి మధ్యా తరచూ గొడవలు జరుగుతూనే ఉండేవి. కానీ లాక్ డౌన్ కారణం వల్ల ఇద్దరూ ఇంట్లోనే ఉండటం వలన ఆ గొడవలు మరింత సీరియస్ అవ్వడంతో భువన్ భార్య తన కూర్చుని తీసుకొని తన అక్కయ్య ఇంటికి వెళ్ళింది.
ఆ విషయంలో మొదట ఆగ్రహానికి లోనైన భువన్ ఒక రోజు ఫుల్ గా తాగి అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్లి భార్యని చితకబాదాడు. ఆ కోపంతో భార్య పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు తనకి గట్టిగానే బుద్ది చెప్పి పంపారు. దాంతో రూటు మార్చి తన భార్యని ఇంటికి రమ్మని కోరాడు. ఎన్ని రోజులుగా అడుగుతున్నా రాకపోవడం, మరోవైపు పోలీసులు కూడా అతన్ని అబ్జర్వేషన్ లో పెట్టడం వలన పూర్తి మనస్తాపానికి గురైన భువన్ ఈ రోజు మధ్యాహ్న సమయంలో భార్య ఉంటున్న ఇంటికి కిందే తనపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఇది చూసిన స్థానికులు వెంటనే మంటలు ఆర్పీ, 108 ద్వారా హాస్పిటల్ కి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితిపై సమాచారం తెలియాల్సి ఉంది.
74526 58791its fantastic as your other articles : D, regards for posting . 812493
118035 581172Hi this is somewhat of off topic but I was wondering if blogs use WYSIWYG editors or if you need to manually code with HTML. Im starting a weblog soon but have no coding information so I wanted to get guidance from someone with experience. Any help would be greatly appreciated! 66105