ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు: ప్రెస్ మీట్ లో హీరో గోపీచంద్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,658FansLike
57,764FollowersFollow

మాచో హీరో గోపీచంద్ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భీమా’. ఎ హర్ష దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఘన విజయాన్ని సాధించింది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ ప్రెస్ మీట్ ని నిర్వహించింది.

ప్రెస్ మీట్ లో హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. భీమా చిత్రాన్ని గొప్పగా ఆదరించి ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఇంత మంచి కథని నా దగ్గరకి తీసుకొచ్చి, సినిమాని అద్భుతంగా తీసి, ప్రేక్షకుల చేత ప్రశంశలు అందుకునేలా చేసిన దర్శకుడు హర్షకి ధన్యవాదాలు. సినిమాకి కావాల్సినదంత సమకూర్చి ఎక్కడా రాజీపడకుండా సినిమా నిర్మించి ఇంత మంచి అవుట్ పుట్ తెచ్చిన నిర్మాతలు రాధమోహన్, శ్రీధర్ గారికి ధన్యవాదాలు. నరేష్ గారితో సినిమా చేసి చాలా కాలమైయింది. ఇందులో సెకండ్ హాఫ్ లో ఆయన పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. స్వామీ వండర్ ఫుల్ విజువల్స్ ఇచ్చారు. థియేటర్స్ లో అదిరిపోయాయి. అజ్జు చాలా మంచి డైలాగ్స్ రాశారు. డైలాగ్స్ కి థియేటర్స్ లో క్లాప్స్ పడుతున్నాయి. ఫైట్స్ ఎక్స్ ట్రార్డినరీగా వున్నాయి. ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో ఎమోషన్ ని అద్భుతంగా ఎలివేట్ చేస్తూ ఫైట్స్ డిజైన్ చేశారు రామ్ లక్ష్మణ్ మాస్టర్స్. చివరి అరగంట థియేటర్స్ లో క్లాప్స్, విజల్స్ పడుతూనే వున్నాయి. ఆర్ట్ డైరెక్టర్ అద్భుతంగా చేశారు. రవి బస్రూర్ ఎక్స్ ట్రార్డినరీగా మ్యూజిక్ చేశారు. తన మ్యూజిక్ ఈ సినిమాకి ఒక బ్యాక్ బోన్. ఈ సినిమాకి సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. ఇంకా సినిమా చూడనివారు తప్పకుండా థియేటర్ కి వెళ్లి సినిమా చూడండి. గొప్ప థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’ అన్నారు.

నిర్మాత కె కె రాధామోహన్ మాట్లాడుతూ..ఇంత మంచి ప్రాజెక్ట్ ని నా వద్దకు తీసుకొచ్చిన మా సహా నిర్మాత శ్రీధర్ గారికి ధన్యవాదాలు. ఇంతమంచి ప్రాజెక్ట్ ని చేసే అవకాశం ఇచ్చిన గోపీగారికి, హర్ష గారికి ధన్యవాదాలు. అజ్జు మంచి డైలాగ్స్ రాశాడు. ఆర్ట్ డైరెక్టర్ రమణ లంక సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. డీవోపీ స్వామీ అద్భతమైన విజువల్స్ ఇచ్చారు. ప్రేక్షకులు విజువల్స్ ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నరేష్ గారి పాత్ర అందరినీ అలరిస్తుంది. రవి బస్రూర్ మ్యూజిక్ ఈ సినిమాకి బ్యాక్ బోన్ గా నిలిచింది. గూస్ బంప్స్ మ్యూజిక్ ఇచ్చారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, వెంకట్ అద్భుతంగా యాక్షన్ డిజైన్ చేశారు. ఎడిటర్ తమ్మిరాజు గారు చాలా అద్భుతంగా ఎడిట్ చేశారు. మా ప్రొడక్షన్ టీం అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. గోపీచంద్ గారితో పంతం సినిమా తర్వాత మా అనుబంధం అలానే కొనసాగుతుంది. ఈ ప్రాజెక్ట్ చేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించాం. సినిమా విజువల్స్ రిచ్ నెస్ తెరపై కనిపిస్తుంది. సినిమాకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పంధన వస్తోంది” అన్నారు.

దర్శకుడు హర్ష మాట్లాడుతూ.. భీమాకి ప్రేక్షకుల నుంచి వస్తున్న అద్భుతమైన స్పంధన చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. ఇంటర్వెల్, క్లైమాక్స్ లో ప్రేక్షకుల కేరింతలు చూడటం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇది మా అందరి టీం వర్క్. నిర్మాతలు శ్రీధర్, రాధమోహన్ గారికి ధన్యవాదాలు. ఎంతో గొప్ప ప్రోత్సహించి అద్భుతంగా పెర్ఫార్ చేసిన గోపీచంద్ గారికి ధన్యవాదాలు. భీమా, రామాల ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. నన్ను నమ్మిన నరేష్ గారికి ధన్యవాదాలు. తన పాత్రని చాలా మెరుగుపరిచారు. ఆడియన్స్ ఆ ట్రాక్ ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అజ్జు చాలా మంచి డైలాగ్స్ రాశారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ గొప్పగా యాక్షన్ డిజైన్ చేశారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. థియేటర్స్ లో ఎంజాయ్ చేసే సినిమా ఇది. తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూడాలి” అని కోరారు.

డా. నరేష్ వికే మాట్లాడుతూ.. చాలా మంది ప్రేక్షకులు భీమా చూసి ఇంటర్వెల్ ఎక్స్ లెంట్, క్లైమాక్స్ బ్లాక్ బస్టర్ అని మెసేజ్ పెట్టారు. ప్రతి సినిమాకి ఈ రెండు చాలా కీలకం. ఇందులో విజయం సాధించిన దర్శకుడు హర్షకి అభినందనలు. సంక్రాంతి సినిమాల శివరాత్రి సినిమా వుంటుంది. భీమా శివరాత్రి సినిమా. థియేటర్స్ దద్దరిల్లాయి. రెండు పాత్రలు పండించడం చాలా కష్టం. గోపీచంద్ గారు చాలా అద్భుతంగా పండించారు. గోపీచంద్ కి హ్యాట్సప్. రాధమోహన్ గారు చాలా రిచ్ గా తీశారు. ప్రతిఒక్కరూ థియేటర్స్ లో ఎంజాయ్ చేసే మాస్ సినిమా ఇది. సినిమాలో పని చేసిన పేరుపేరునా అందరికీ ధన్యవాదాలు” తెలిపారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ ప్రెస్ మీట్ చాలా గ్రాండ్ గా జరిగింది.

సినిమా

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ నుంచి హృదయాన్ని తాకే ‘సంచారమే’ పాట...

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’ సినిమా నుంచి తొలి గీతంగా ‘సంచారమే’ పాటను చిత్ర బృందం విడుదల...

‘మిరాకిల్’ నా కెరీర్ బెస్ట్ ఫిల్మ్: హెబ్బా పటేల్

తెలుగు సినీ పరిశ్రమలో వినూత్న కథతో రూపొందుతున్న మిరాకిల్ సినిమా ఒక్కసారిగా ఆసక్తిని పెంచుతోంది. క్రేజీ హీరోయిన్ హెబ్బా పటేల్ ఈ చిత్రాన్ని తన కెరీర్‌లో...

అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సినీ రంగ స్పెషల్ అవార్డులు–2025 సందర్భంగా పలువురు ప్రముఖులకు గౌరవం దక్కింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy అవార్డు...

విశాల్ ‘మొగుడు’గా మాస్ ఎంటర్‌టైనర్… సుందర్ సి హ్యాట్రిక్ టార్గెట్

తమిళ స్టార్ హీరో విశాల్ ప్రధాన పాత్రలో, దర్శకుడు సుందర్ సి తెరకెక్కిస్తున్న తాజా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు ‘మొగుడు’ అనే టైటిల్ ఖరారైంది. గతంలో...

‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’కి గద్దర్ అవార్డుల్లో డబుల్ గౌరవం

తెలంగాణ ప్రభుత్వం 2025 సంవత్సరానికి గానూ ప్రకటించిన ప్రతిష్టాత్మక Telangana Gaddar Film Awardsల్లో The Great Pre Wedding Show చిత్రానికి రెండు అవార్డులు...

రాజకీయం

డోన్ సభలో ఫిర్యాదు.. వేదికపైనే అధికారులకు చంద్రబాబు వార్నింగ్

కర్నూలు జిల్లా డోన్‌లో జరిగిన బహిరంగ సభలో ఒక రైతు తన భూమి సమస్యను నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ప్రజల సమక్షంలోనే అధికారులను ప్రశ్నిస్తూ సమస్య...

విజయా బ్రాండ్‌పై లీజు వివాదం.. జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు

తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా విశ్వాసాన్ని సంపాదించుకున్న విజయా డెయిరీ బ్రాండ్‌పై ఇప్పుడు వివాదం నెలకొంది. గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయా బ్రాండ్‌ను ప్రైవేట్ సంస్థకు లీజుకు ఇచ్చిన విధానం తీవ్ర చర్చకు దారితీస్తోంది....

సభ్యత్వాల కోసం ‘సాధక్’లకు సహకరించండి: నాగబాబు పిలుపు

జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని ఎమ్మెల్సీ కె. నాగబాబు పిలుపునిచ్చారు. సభ్యత్వాలు నమోదు చేసే ‘సాధక్’లకు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో సహకరించాలని ఆయన సూచించారు....

లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని వస్తున్న ప్రచారం కూటమి పార్టీల మధ్య విభేదాలు సృష్టించేందుకే!

గత కొన్నాళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రశ్న సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది — నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారా? ముఖ్యంగా ఉగాది తర్వాత సీఎం మార్పు జరిగే అవకాశముందంటూ కొన్ని వర్గాలు...

ఇంటి కోసం పోరాటం… మహిళకు న్యాయం

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో ఒక మహిళ తన ఇంటిని తిరిగి పొందేందుకు చేసిన పోరాటానికి చివరికి న్యాయం లభించింది. అప్పుల పేరుతో జరిగిన అన్యాయానికి చెక్ పెట్టుతూ జిల్లా కలెక్టర్ హిమాన్షు...

ఎక్కువ చదివినవి

విశాల్ ‘మొగుడు’గా మాస్ ఎంటర్‌టైనర్… సుందర్ సి హ్యాట్రిక్ టార్గెట్

తమిళ స్టార్ హీరో విశాల్ ప్రధాన పాత్రలో, దర్శకుడు సుందర్ సి తెరకెక్కిస్తున్న తాజా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు ‘మొగుడు’ అనే టైటిల్ ఖరారైంది. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆంబళ’, ‘మద...

చంద్ర గ్రహణం 2026: మీ రాశిపై ప్రభావం ఎంత? ఏ రంగు బట్టలు మంచివి?

మార్చి 3, 2026 సాయంత్రం జరగబోయే చంద్ర గ్రహణం అనేక రాశులపై ప్రభావం చూపే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. చంద్ర గ్రహణం సాధారణంగా మన భావోద్వేగాలు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ...

Chiranjeevi: రెండు లెజండరీ అవార్డుల.. ‘త్రినేత్రుడు’

Chiranjeevi: ‘తెలుగు సినిమాకి రెండు కళ్లు ఎన్టీఆర్, ఏఎన్నార్ అయితే.. మూడో కన్ను చిరంజీవి’. భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ఎప్పుడూ చెప్పే మాట. సినీ పరిశ్రమకు విశిష్ట సేవ చేసినవారిగా వీరికి...

Gaddar Awards-2026: గద్దర్ అవార్డుల ప్రకటన.. చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం

Gaddar Awards-2026: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2025లో విడుదలైన సినిమాలకు గద్దర్ అవార్డులు ప్రకటించారు. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (తండేల్), ఉత్తమ నటిగా రష్మిక (ది గర్ల్ ఫ్రెండ్), ఉత్తమ దర్శకుడిగా సాయిలు...

కల్తీ నెయ్యి డబ్బులపై ధూళిపాళ్ల సంచలన ఆరోపణలు

టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల తాజాగా కల్తీ నెయ్యి వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కల్తీ నెయ్యి అక్రమ సొమ్ము కోట్ల రూపాయలుగా విజయవాడ, చెన్నైలకు చేరిందని ఆయన పేర్కొన్నారు....