పేదలకు ప్రభుత్వం ఎందుకు ఇళ్ళ స్థలాలు ఇస్తుంది.? ఇంకెందుకు, వారికి నివాస హక్కు కల్పించేందుకు. కడు పేదలు గనుక, సొంత గూడు వుండదు గనుక.. వారికి ప్రభుత్వం సాయం అందిస్తుంది, ఆదుకుంటుంది. ఈ క్రమంలోనే పేదలకు ఇళ్ళు లేదా ఇళ్ళ స్థలాలు ఇవ్వడమనేది కొత్త వ్యవహారం కాదు, ఎన్నో ఏళ్ళ నుంచి నడుస్తున్న వ్యవహారమే.
‘మేం, పేదలకు ఇస్తున్నవి ఇళ్ళు కావు, ఆస్తులు..’ అంటూ వైఎస్ జగన్ సర్కార్ ఘనంగా చెప్పుకుంది. ఐదేళ్ళ తర్వాత ఇళ్ళ స్థలాల్ని అవసరమైతే అమ్ముకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. కానీ, అలా అమ్మేసుకుంటే వాళ్ళు మళ్ళీ ఇళ్ళు లేని పేదలవుతారు కదా.? అన్నది అసలు ప్రశ్న. ఇదే ప్రశ్నను న్యాయస్థానం కూడా ప్రభుత్వానికి వేసింది.
అయినా, సెంటు స్థలంలో.. సెంటున్నర స్థలంలో ఇళ్ళు ఏంటి.? ఈ ప్రశ్న కూడా గతంలోనే ఉత్పన్నమయ్యింది. ఇదే ప్రశ్న హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వేసింది. అటు ఐదేళ్ళ తర్వాత ఇంటిని అమ్మేసే వ్యవహారంపైనా, ఇటు తక్కువ స్థలంలో ఇంటి నిర్మాణంపైనా హైకోర్టు సంధించిన ప్రశ్నలతో జగన్ సర్కారుకి మైండ్ బ్లాంక్ అయిపోయే వుండాలి.
నిజానికి, పేదలకు ఇళ్ళ స్థలాల పేరుతో ఎక్కడికక్కడ వైసీపీ నేతలు ఆర్థికంగా లాభపడ్డారు. ప్రభుత్వం, భూమిని సేకరించే క్రమంలో ఎక్కువగా అధికార పార్టీ నేతలు, అధికార పార్టీ మద్దతుదారుల నుంచే ఆ పని చేయాల్సి వచ్చింది. అందుకు అనుగుణంగా వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో ఆవ భూముల వ్యవహారానికి సంబంధించి కోట్లు చేతులు మారాయనీ, వందల కోట్ల కుంభకోణం నడిచిందన్న ఆరోపణలున్నాయి. పేదలందరికీ ఇళ్ళు.. అనేది మంచి ఉద్దేశ్యమే అయినా, ఈ ఘనకార్యం వెనుక అసలు కుట్ర కోణం ఇదేనంటూ విపక్షాలు చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు.
ఇక, ఇప్పుడు కోర్టు తీర్పుతో వైఎస్ జగన్ సర్కార్ ఏం చేయబోతోంది.? మహిళలకేనా.? పురుషుల పట్ల ఎందుకంత నిర్లక్ష్యం.? ట్రాన్స్జెండర్లంటే ఎందుకంత వ్యతిరేకం.? అని హైకోర్టు సంధించిన ప్రశ్నలకు జగన్ సర్కార్ ఎలా సమాధానమిస్తుంది.? వేచి చూడాల్సిందే.
620451 211359Awesome write-up , Im going to spend more time researching this topic 68409
500257 847766I enjoy this web site, will definitely arrive back. Make positive you carry on writing high quality posts. 369391