ముంబయిలోని భాండప్ ప్రాంతంలో ఉండే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాప్తి చెందడటంతో పాటు పక్క భవనాలకు అంటుకున్నాయి. అగ్ని మాపక సిబ్బంది చాకచక్యంతో వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వార్డులో మొదలైన ఈ అగ్ని ప్రమాదం మెల్ల మెల్లగా పెరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లుగా అధికారులు అధికారికంగా ప్రకటించారు.
ఈ అగ్ని ప్రమాదంలో మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. మొత్తం 76 మంది కరోనా రోగులు ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఈ అగ్ని ప్రమాద విషయమై అధికారులు విచారణ మొదలు పెట్టారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందనే అభిప్రాయంకు పోలీసులు వచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.
346402 575591Likely to commence a business venture about the refers to disclosing your products and so programs not just to individuals near you, remember, though , to several potential prospects much more via the www often. earn funds 926129