బ్రిటన్ లో కొత్త వైరస్ స్ట్రెయిన్ విజృంభణ కారణంగా ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ తన భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈమేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితిని వివరించారు. దేశంలో ఉన్న విపత్కర పరిస్థితుల దృష్ట్యా తాను ఇక్కడే ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుతం ఇక్కడ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో గత రాత్రి బ్రిటన్ లో లాక్ డౌన్ విధించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే తాను భారత్ లో పర్యటించలేకపోతున్నానని తెలిపినట్టు తెలుస్తోంది.
ఈ ఏడాది జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు బోరిస్ జాన్సన్ ముఖ్య అతిధిగా హాజరు కావాల్సి ఉంది. కానీ.. బ్రిటన్ లో వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించారు. సోమవారమే ఈమేరకు ప్రధాని ప్రకటన చేశారు. ఈ పరిస్థితుల్లో తాను భారత్ పర్యటనకు వెళ్లడం సరికాదని బోరిస్ జాన్సన్ భావించినట్టు డౌనింగ్ స్ట్రీట్ ప్రతినిధి తెలిపారు.
713285 374125It is truly a cool and helpful piece of info. Im glad which you basically shared this valuable information with us. Please stay us informed like this. Thank you for sharing. 512200
624708 616801Thanks for taking the time to discuss this subject. I actually appreciate it. Ill stick a link of this entry in my weblog. 389605