భారత్, బ్రిటన్ మధ్య విమాన రాకపోకలపై నిషేధం జనవరి 7 వరకు పొడిగించారు. యూకేలో కరోనా కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ‘యూకే నుంచి వచ్చి, వెళ్లే విమానాలపై విధించిన తాత్కాలిక నిషేధం జనవరి 7 వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ తర్వాత కఠిన ఆంక్షలతో రాకపోకలు ప్రారంభిస్తాం. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం’ అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురి ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ట్వీట్ చేశారు.
భారత్, బ్రిటన్ మధ్య ఎయిరిండియా సహా నాలుగు విమానయాన సంస్థలు ప్రస్తుతం 67 సర్వీసులు నడుపుతున్నాయి. ప్రతిరోజూ దాదాపు 2వేల నుంచి 2500 మంది వీటిలో ప్రయాణిస్తారు. కరోనా కొత్త వైరస్ కల్లోలం నేపథ్యంలో బ్రిటన్ నుంచి వచ్చే విమానాలపై చాలా దేశాలు ఆంక్షలు విధించాయి. భారత్ కూడా బ్రిటన్ విమానరాకపోకలపై తాత్కాలిక నిషేధం విధించింది.
531007 930750Thanks for this exceptional. I was wondering whether you were preparing of writing similar posts to this 1. .Maintain up the excellent articles! 380040
513964 716354Some actually superb info , Sword lily I found this. 738318