టర్కీ, సిరియా దేశాలు ప్రకృతి విలయంలో అల్లకల్లోలమయ్యాయి. రెండు దేశాల సరిహద్దుల్లో సోమవారం ఉదయం సంభవించిన పెను భూకంపంలో వందలాది భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఎక్కడ చూసినా శిధిలాలే. భూకంప తీవ్రతకు ఇప్పటివరకూ 2,600 మందికి పైగా మృతి చెందినట్టు తెలుస్తోంది.
దశలవారీగా సంభవిస్తున్న భూ ప్రకంపనలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దక్షిణ టర్కీ, ఉత్తర సిరియా దేశాల్లో భూకంపం తీవ్రత ఎక్కువగా ఉంది. తెల్లవారుఝాము 4.17 గంటలకు తొలి భూకంపం సంభవించిన తర్వాత దశలవారీగా 20సార్లు తీవ్రస్థాయిలో భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ఆస్తి, ప్రాణ నష్టాలు ఎక్కువగా జరిగాయని తెలుస్తోంది.
టర్కీలో 1600 మంది మరణించగా.. 8500 మందికి పైగా గాయపడినట్టు.. దాదాపు 3వేల భవనాలు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. సిరియాలో 1000 మందికి పైగా మరణించారని.. వందల సంఖ్యలో గాయపడగా.. అనేక భవనాలు నేలమట్టమయ్యాయని తెలుస్తోంది. రెండు దేశాల్లో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రపంచ దేశాలు టర్కీ, సిరియాలకు సాయం అందించేందుకు ముందుకొస్తున్నాయి.
200780 712208Wow Da weiss man, wo es hingehen muss Viele Grsse Mirta 221028
911691 45021An really fascinating go via, I may not concur entirely, even so you do make some genuinely legitimate factors. 66831
201897 596175Hey! Good stuff, do tell us when you finally post something like this! 657259