‘నేను అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నా.. అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా వుంటుంది. అమరావతిని చంద్రబాబులా గ్రాఫిక్స్లో కాకుండా, నిజంగా అభివృద్ధి చేస్తాం..’ అని 2019 ఎన్నికల సమయంలో చెప్పిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక మాట మార్చారు.. మూడు ముక్కలాట పేరుతో, విశాఖ రాజధాని పాట పాడుతున్నారు.
మార్చి మూడో వారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖకు మకాం మార్చేస్తారన్నది తాజా ఖబర్. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖ రాజధానిగానే రాష్ట్ర పాలన.. అంటూ పలువురు మంత్రులు గతంలోనే ప్రకటించేశారు. అందుకు అనుగుణంగానే వైఎస్ జగన్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
మరి, సుప్రీంకోర్టులో విచారణ దశలో వున్న మూడు రాజధానుల కేసు సంగతేంటి.? అంటే, ఫిబ్రవరి 23న తమకు అనుకూలంగా తీర్పు వస్తుందన్నది వైసీపీ ఉవాచ. నిజంగా అలా జరుగుతుందా.? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే. విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనకు అనుకూలమైన భవనాలకు సంబంధించిన అన్వేషణ చాలాకాలంగా జరుగుతోంది.
తాజాగా, ముఖ్యమంత్రి నివాసం కోసం ఓ భవనాన్ని కూడా విశాఖ బీచ్ రోడ్డులో ఖరారు చేసేశారట. అంటే, తాడేపల్లి నుంచి విశాఖకు ‘ముఖ్యమంత్రి నివాసం’ తరలింపు అనేది లాంఛనమేనన్నమాట. మార్చి 21 లేదా 22న గృహ ప్రవేశం అని కూడా చెప్పేస్తున్నారు.
ఏమైనా జరగొచ్చు. ముఖ్యమంత్రి నివాసం మార్పు.. అనేది పెద్ద విషయమే కాదు. మూడు రాజధానుల చట్టాన్ని అసెంబ్లీలో చేసేయడం కంటే చాలా చాలా తేలిక. కాకపోతే, ఆ చట్టం చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది. అలా వైఎస్ జగన్ మళ్ళీ తాడేపల్లికి తిరిగి రాక తప్పదేమో.!
325751 48827I believe this site contains some very great data for everybody : D. 204183
633802 160119Yay google is my king helped me to discover this outstanding website! . 204872