Earthquake: నేపాల్ (Nepal) లో పెను భూకంపం (earthquake) సంభవించింది. నిన్న రాత్రి 11.47 గంటల ప్రాంతంలో వాయువ్య నేపాల్ మారుమూల పర్వత ప్రాంతంలోని జజర్ కోట్ వద్ద భూకంపం సంభవించింది. ఇప్పటికీ ఈ విపత్తులో 128 మంది మరణించినట్టు.. 140 మంది గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. రాత్రివేళ భూకంపం సంభవించడం.. పలుచోట్ల రహదారులపై కొండచరియలు విరిగిపడటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. రాజధాని కాట్మాండులో కూడా ప్రకంపనలు వచ్చాయి.
భూకంప ధాటికి పలుచోట్ల ఇల్లు నేలమట్టం అయ్యాయి. రుకమ్ జిల్లాలో 35, జజర్ కోటలో 34మంది ఇళ్లు కూలి మృతి చెందారు. శనివారం తెల్లవారుఝామున కూడా 4సార్లు భూప్రకంపనలు వచ్చాయి. భూకంపం 11మైళ్ల లోతులో సంభవించినట్టు నేపాల్ జాతీయ భూకంప పర్యవేక్షణ కేంద్రం వెల్లడించింది. 2015లో సంభవించిన భూకంపం ధాటికి 9వేల మంది మృతి చెందారు. భూకంప తీవ్రతకు ఇటు ఢిల్లీ (Delhi) , బీహార్, యూపీలో కూడా ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు.