Movie: సినిమా పైరసీకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పైరసీని అరికట్టేందుకు, డిజిటల్ ప్లాట్ ఫామ్స్ నుంచి పైరసీ కంటెంట్ తొలగించేందుకు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి 12మంది నోడల్ అధికారును ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. పైరసీతో చిత్రపరిశ్రమకు ఏటా రూ.20వేల కోట్ల నష్టం జరుగుతోందని.. ఇది పరిశ్రమకే కాకుండా ప్రపంచానికీ ముప్పని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) వెల్లడించారు. పరిశ్రమ కోరుకున్న పెద్ద డిమాండ్ నెరవేర్చామని.. చర్యలు తీసుకోవాల్సి సమయం ఇదేనన్నారు.
డిజిటల్ వేదికలన్నింటిలో తమ కంటెంట్ తొలగించేందుకు అధికారం ఉన్న ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చని అన్నారు. ఇందకు సీబీఎఫ్సీ (CBFC) సర్టిఫికెట్, యాజమాన్య రుజువును చూపాలన్నారు. పైరసీకి పాల్పడితే తీసుకోబోయే కఠినమైన జరిమానాలకు వర్షాకా సమావేశాల్లో సినిమాటోగ్రాఫ్ బిల్లును ఆమోదించింది. ఇందులో 3నెలల జైలు, 3లక్షల జరిమానా, గరిష్టంగా 3ఏళ్ల వరకూ పొడిగింపు, సినిమా నిర్మాణంలో ఐదు శాతం జరిమానా విధించే అవకాశం ఉంది.