నిస్సిగ్గుగా నియోజకవర్గానికి 50 కోట్లు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,075FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోసం వివిధ రాజకీయ పార్టీలు చేసిన ఖర్చు ఎంతో తెలుసా? 10 వేల కోట్ల రూపాయలట. ఇది తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చెప్పిన లెక్క. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో తక్కువలో తక్కువ అంటే 50 కోట్ల రూపాయల్ని వివిధ రాజకీయ పార్టీలు ఖర్చు చేశాయని జేసీ దివాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని చోట్ల ఈ ఖర్చు ఇంకా చాలా ఎక్కువగా వుందన్నది ఆయన చెబుతున్న విషయం. ఇందులో వాస్తవం లేకపోలేదు. ఒక్కో ఓటుకీ కనీసం 2 వేల రూపాయల్ని ఆయా రాజకీయ పార్టీలు నిర్ణయించి, పంచేసిన దాఖలాలు చూస్తూ వస్తున్నాం.

అయితే, జేసీ దివాకర్‌రెడ్డి ఓటర్లపైనా సంచలన వ్యాఖ్యలు చేయడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. కూటికి గతిలేనివాడు కూడా ఓటుకి 5 వేల రూపాయలు డిమాండ్‌ చేస్తున్నాడని జేసీ చెప్పడంతో మీడియా ప్రతినిథులే ముక్కున వేలేసుకున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, జేసీ దివాకర్‌రెడ్డికి కొత్త కాదు. ఆయనకి అదో సరదా. సీనియర్‌ పొలిటీషియన్‌ని గనుక తాను ఏం చెప్పినా చెల్లిపోతుందనే భావనతో వుంటారు జేసీ దివాకర్‌రెడ్డి. అదే సమయంలో అలవాటులో పొరపాటుగా కొన్ని వాస్తవాలు ఆయన నోటి వెంట బయటకొచ్చేస్తాయి.

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ధన ప్రవాహం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ‘మేం, డబ్బులు పంచడంలేదు’ అని ప్రకటించుకున్న ఒకే ఒక్క పార్టీ జనసేన. ‘మీరు మమ్మల్ని గెలిపించినా, గెలిపించకున్నా మీ వెంటే వుంటాం’ అని చెప్పి మరీ జనసేన పార్టీ ఎన్నికల ప్రచారంలో తనదైన ప్రత్యేకతను చాటుకుంది. అయితే, ఎలాగైనా గెలవాలన్న కసితో తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బుని పంచాయి.

డబ్బు తీసుకుని మాత్రమే ఓటర్లు ఓట్లను వేస్తారనుకోవడం పొరపాటు. ఓటర్లలోనూ చాలా చైతన్యం వచ్చింది. ఇంటికి వచ్చి మరీ ఆయా పార్టీలకు చెందినవారు డబ్బులు చేతుల్లో పెడుతున్నప్పుడు కొందరు తీసుకుని వుండొచ్చుగాక. కానీ, ఓటు ఎవరికి వెయ్యాలన్నదానిపై ఓటర్లకు ఖచ్చితమైన అవగాహన వుంటుంది. పైగా, రాజకీయ పార్టీలే చెప్పాయి ‘ఎవరు డబ్బులిచ్చినా తీసుకోండి, మీకు నచ్చినోళ్ళకు మాత్రమే ఓటు వేయండి’ అని. దాంతో, ఈసారి ఓటర్లు మరింత విజ్ఞతను ప్రదర్శించినట్లు అర్థమవుతోంది.

ఓటరు ఓటు కోసం డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారంటే, అది వారి తప్పు కాదు. సంక్షేమ పథకాల పేరుతో తమ చేతుల్లో పప్పూ బెల్లం పెడుతూ, ప్రజా ప్రతినిథులు అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతోంటే, పార్టీలకతీతంగా నేతలు కోట్లు వెనకేసుకుంటోంటే ఓటర్లు మాత్రం ఎందుకు మారకూడదు? ఎన్నికల నిర్వహణ సైతం అత్యంత అచేతనావస్థలో నడిచింది ఈసారి. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయలేకకపోయింది ఎన్నికల కమిషన్‌.

వ్యవస్థలో ఇలాంటి లోపాల్ని రాజకీయ పార్టీలు సొమ్ము చేసుకుంటున్నాయి గనుకనే, ఎన్నికల ప్రక్రియ అంటేనే ప్రజల్లో అసహనం, అయిష్టం పెరిగిపోతున్నాయి. రాజకీయాల్లో మార్పు రావాలంటే జేసీ దివాకర్‌రెడ్డి చెబుతున్న మాటలు ‘ఎన్నికల వేళ తిన్న దెబ్బ’ కారణంగా బయటకొచ్చినట్టు అర్థం చేసుకోవాలి. ఖర్చు తడిసి మోపెడైపోవడంతో ఆ బాధలోనే జేసీ దివాకర్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మీరెంత ఖర్చు పెట్టారు?’ అని మీడియా అడిగితే, ‘అందరం ఖర్చు చేశాం.. మేం పంచాం, ఇంకొకరు పంచారు. అందరం 50 కోట్ల దాకా పంచినట్లే లెక్క’ అని తెలివిగా జేసీ సమాధానమిచ్చారు.

9 COMMENTS

సినిమా

“సీట్ ఎడ్జ్ సస్పెన్స్… ‘తిమ్మరాజుపల్లి టీవీ’పై దర్శకుడు మునిరాజు నమ్మకం”

హీరో Kiran Abbavaram న్యూ టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ సుమైర స్టూడియోస్‌తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ. తేజ వేల్పుచర్ల సహ...

“ఫస్ట్ హాఫ్ లాక్… అనిల్ రావిపూడి కొత్త ప్రాజెక్ట్‌కు సూపర్ స్టార్ట్!”

దర్శకుడు Anil Ravipudi తన తదుపరి సినిమాకు సంబంధించిన ఫస్ట్ హాఫ్‌ను పూర్తిగా లాక్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే కథనం దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్...

“టీజర్ లేదు… ‘డ్రాగన్’ ఫస్ట్ లుక్ ప్లాన్ ఫిక్స్!”

N. T. Rama Rao Jr. నటిస్తున్న డ్రాగన్ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మే 20న...

రొటీన్ కాదట… ‘పెద్ది’ క్లైమాక్స్ షాక్ ఇవ్వనుందా?”

పెద్ది సినిమా గురించి వస్తున్న తాజా అప్‌డేట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. దర్శకుడు Buchi Babu Sana ఈ చిత్రానికి సాధారణ కమర్షియల్ ముగింపుకంటే...

Jananayagan: ‘జననాయగన్’ లీక్ కేసులో పురోగతి.. ఆరుగురి అరెస్ట్..

Jananayagan: తమిళ హీరో విజయ్ నటించిన జననాయగన్ సినిమా లీక్ అంశం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా దక్షిణాది చిత్రసీమను కలవరపరచిందనే చెప్పాలి....

రాజకీయం

“ఆత్మాహుతి వ్యాఖ్యలు… వైసీపీలో కొత్త వివాదం”

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది YSR Congress Party. పార్టీ నేతల నుంచి వస్తున్న వ్యాఖ్యలు తాజాగా పెద్ద దుమారం రేపుతున్నాయి. టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన Mithun Reddy, తమ అధినేత...

“రక్త చరిత్రే రాజకీయం..!” వైసీపీపై నిమ్మల తీవ్ర ఆరోపణలు

ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. రక్త చరిత్రనే రాజకీయం గా మార్చుకుని వైసీపీ ముందుకు సాగుతోందని ఆయన ఆరోపించారు. ప్రత్యేకంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై మండిపడ్డ...

రోడ్డు కట్‌పై రచ్చ… నాణ్యతా పరీక్షలే అంటూ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ

రాష్ట్రంలో రహదారుల నిర్మాణంపై జరుగుతున్న ప్రచారాలపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టత ఇచ్చింది. కొన్ని వర్గాలు, అనుకూల మీడియా సంస్థలు రోడ్లలో కనిపిస్తున్న కట్‌లను నిర్మాణ లోపాలుగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని...

“వైఎస్ మరణంపై అనుమానాలు ఇప్పుడు నిజమై కనిపిస్తున్నాయి”: అచ్చెన్నాయుడు

అమరావతిలో మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై గతంలో వ్యక్తమైన అనుమానాలు ఇప్పుడు నిజమనే భావన కలుగుతోందని ఆయన...

“ట్రెండ్ కాదు.. లక్ష్యమే ముఖ్యం”: యువతకు లోకేష్ సందేశం

బెంగళూరులో నిర్వహించిన గ్రీన్‌వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఐబీడీపీ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి...

ఎక్కువ చదివినవి

Stand-up Comedian Anudeep: అనుదీప్ క్షమాపణలు.. శాంతించని అభిమానులు

Stand-up Comedian Anudeep: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్‌, రామ్ చరణ్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, నిహారికలపై స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికల చేసిన కామెంట్స్ తీవ్ర...

“హిట్స్ ఉంటేనే డిమాండ్.. శ్రీలీలకు ప్రస్తుతం చిన్న బ్రేక్?”

టాలీవుడ్‌లో ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే ఫలితాల మీదే ఆధారపడే ప్రపంచం. ముఖ్యంగా హీరోయిన్లకు హిట్స్ ఉంటేనే డిమాండ్ పెరుగుతుంది. అందం, అభినయం, డాన్స్—అన్నీ కలగలిపిన ప్రతిభతో Sreeleela తక్కువ సమయంలోనే టాప్ చాయిస్...

“‘అమరావతిని అజరామరం చేశారు’ : నారా లోకేష్”

ఆంధ్రప్రదేశ్ రాజధాని Amaravatiకు చట్టబద్ధ గుర్తింపు లభించడం రాష్ట్ర చరిత్రలో కీలక మైలురాయిగా నిలిచింది. ఈ చారిత్రక బిల్లుపై సంతకం చేసిన Droupadi Murmuకు మంత్రి Nara Lokeshతో పాటు ఎన్డీఏ ఎంపీలు...

“మంగ్లీ కేసు ట్విస్ట్… ఆరోపణలకు కౌంటర్ స్టేట్‌మెంట్!”

హైదరాబాద్‌లో ప్రముఖ గాయని Mangli చుట్టూ కొనసాగుతున్న వివాదం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఆమె Panjagutta Police Station ను ఆశ్రయించి సింగపోగు సుబ్బు అనే వ్యక్తిపై వేధింపులు, డబ్బుల డిమాండ్ ఆరోపణలతో...

Ram Charan: “బాలీవుడ్‌లోకి రామ్ చరణ్..! భన్సాలీ ప్రొడక్షన్‌లో భారీ ప్లాన్..!”

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో భారీ ప్రాజెక్టులో భాగమవుతున్నారా..? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. భారీ చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో రామ్ చరణ్...