దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వల్లే ప్రస్తుతం పెట్రోల్ మరియు డీజిల్ రేట్లు వందను దాటాయి అంటూ బీజేపీ మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అప్పట్లో ఆయన అనుసరించిన విదేశీ విధానం వల్లే ఇప్పుడు పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి.. వాటిని మేము ఇప్పుడు తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామంటూ మంత్రి విశ్వాస్ సారంగ్ అన్నాడు. ఆయన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయంటూ దేశ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
మద్యప్రదేశ్ మంత్రి విశ్వాస్ సారంగ్ మాట్లాడుతూ స్వదేశీ సంస్కృతిని పట్టించుకోకుండా విదేశీ పోకడలకు వెళ్లడం వల్లే ఇప్పుడు దేశంలో ఈ పరిస్థితి నెలకొంది అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. నెహ్రూ విదేశాల్లో చదువుకున్న వ్యక్తి అవ్వడం వల్ల ఆయన విదేశీ సంస్కృతిని ఎక్కువగా పాటించాడు. కనుక ఆయన వల్లే ఇప్పుడు పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి. దేశంలో గాంధీ పరిపాలన వల్ల గ్రామాలు అన్ని కూడా అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయని అన్నాడు. మంత్రి విశ్వాస్ వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్రోల్ రేటు దాదాపుగా రెట్టింపు అయ్యింది. అయినా కూడా మీరు ఇతరులను నింధిస్తూ వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందంటూ ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
769322 648115Conveyancing […]we like to honor other websites on the web, even if they arent related to us, by linking to them. Below are some web sites worth checking out[…] 657209
905673 175503quite excellent put up, i surely love this web web site, keep on it 309824
132197 735821Some times its a discomfort in the ass to read what weblog owners wrote but this internet website is really user genial ! . 242386