‘అల వైకుంఠపురములో’ సినిమాతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్లో అల్ టైం బ్లాక్ బస్టర్ అందుకున్నారు. సినిమా రిలీజై 17 రోజులవుతున్నా ఇంకా థియేటర్స్ దగ్గర క్రౌడ్ తగ్గడం లేదు. ఈ సక్సెస్ లోనే తన తదుపరి సినిమా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో చేయడానికి సిద్ధమయ్యారు.
ఎన్.టి.ఆర్ – త్రివిక్రమ్ సినిమాని ఏప్రిల్ చివరి నుంచి లేదా మే లో మొదలు పెట్టి 2021 సంక్రాంతి కానుకగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇది కాసేపు పక్కన పెడితే, ఇదివరకే త్రివిక్రమ్ మెగాస్టార్ చిరుతో సినిమా ఉందని అనౌన్స్ చేశారు. కానీ అది కాకుండా ఎన్.టి.ఆర్ తో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయగానే అది ఆగిపోయిందనుకున్నారు. కానీ త్రివిక్రమ్ మెగా ఫ్యామిలీతో ఒక ప్రాజెక్ట్ కాదు ఏకంగా 3 కంటిన్యూ ప్రాజెక్ట్స్ డీల్ సెట్ చేసుకున్నాడు.
ఎన్.టి.ఆర్ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవితో కొణిదెల ప్రొడక్షన్స్ – హారిక హాసిని బ్యానర్ లో సినిమా చేస్తారు. ఆ తర్వాత రామ్ చరణ్ తో హారిక హాసిని – పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ లో ఓ సినిమా చేస్తారు. ఫైనల్ గా మూడో మెగా ప్రాజెక్ట్ మళ్లీ అల్లు అర్జున్ తోనే ఉండనుంది. ఇలా మాటల మాంత్రికుడు నెక్స్ట్ 4 సంవత్సరాలకు కావాల్సిన ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టుకొని బిజీ బిజీగా ఉండనున్నాడు.
307543 949602I got what you mean ,bookmarked , extremely good internet site . 778262
562383 2389I adore your wp web template, wherever would you obtain it via? 757045
749097 416831quite nice post, i definitely enjoy this amazing site, persist with it 901435