పద్మ అవార్డుల్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఈ ఏడాది అన్యాయం జరిగింది. టాలీవుడ్లో ఎవరికీ ఒక్క అవార్డూ రాలేదు. హిందీలో నలుగురు సినిమా ప్రముఖులకు పద్మ అవార్డులు ఇచ్చారు. హీరోయిన్ కంగనా రనౌత్, దర్శకుడు-నిర్మాత కరణ్ జోహార్, నిర్మాత ఏక్తా కపూర్, గాయకుడు అద్నాన్ సమీకి పద్మశ్రీ అవార్డులు ఇచ్చారు. ఆ నలుగురు కంటే గొప్పవారు తెలుగులో ఎంతోమంది ఉన్నారు. ఆ నలుగురి కంటే సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రముఖులు తెలుగులో ఎంతోమంది ఉన్నారు. మరి, తెలుగు సినిమా ప్రముఖులకు అవార్డులు ఎందుకు రాలేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.
పద్మ అవార్డు అందుకోవడానికి అర్హత గల హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు, గాయకులూ తెలుగులో లేరా? ఎంతోమంది ఉన్నారు. గాయకుడు అద్నాన్ సమీకి పద్మశ్రీ ఇచ్చారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం ఏం పాపం చేశారు? ఆయన ఎటువంటి రాగంలో అయినా పాడగల ప్రతిభాశాలి. ఎక్కువ పాటలు పాడి గిన్నిస్ బుక్ ఎక్కిన గాయకుడు. ఆరు నేషనల్ అవార్డులు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులు పాతిక అందుకున్నారు. రెట్రో పాటలు ఆయనలా ఇప్పటి గాయకులు ఎవరైనా పాడగలరా? లేదు. ఎస్పీబీ కంటే కచ్చితంగా అద్నాన్ సమీ గొప్ప కాదు. ఆయనకు పద్మశ్రీ రాకుండా అద్నాన్ సమీకి రావడం శోచనీయం.
తెలుగు సినిమా ఇండస్ట్రీ, భారతీయ ఇండస్ట్రీ గర్వించదగ్గ గొప్ప దర్శకుడు దాసరి నారాయణరావు. 150 సినిమాలు తీశారు. ఎంతోమంది ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకొచ్చారు. ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలకు కథలు రాశారు. దర్శకత్వం వహించారు. నిర్మించారు. దర్శకుడిగా, నిర్మాతగా దాసరి కంటే కరణ్ జోహార్ గొప్ప చిత్రాలు తీశాడా? దాసరి కంటే ఎక్కువమంది ప్రతిభావంతులను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశాడా? ఈలోకం విడిచి వెళ్లిన తర్వాతనైనా దాసరికి సముచిత గౌరవం ఇవ్వరా? ఈ ఏడాది కొందరు దివంగతులకు పద్మ అవార్డులు ఇచ్చినప్పుడు దాసరికి కూడా ఇస్తే బావుండేది.
అడల్ట్ కంటెంట్ సినిమాలు ‘డర్టీ పిక్చర్’, ‘రాగిణి ఎంఎంఎస్’, ‘లిప్ స్టిక్ అండర్ బుర్ఖా’తో పాటు సీరియల్స్, వెబ్ సిరీస్ లు నిర్మించిన ఏక్తా కపూర్ కి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. ఆమె కంటే గొప్ప చిత్రాలు నిర్మించిన అల్లు అరవింద్ సంగతేంటి? దిల్ రాజు సంగతేంటి? మరికొందరు నిర్మాతల సంగతేంటి? తమ కుటుంబ హీరోలతో మాత్రమే కాకుండా నాని, నాగచైతన్య, విజయ్ దేవరకొండ తదితర హీరోలతో విలువలతో కూడిన కుటుంబ, వినోదాత్మక సినిమాలు అల్లు అరవింద్ నిర్మించారు. ఏక్తా కపూర్ టైపులో అడల్ట్ కంటెంట్ ను నమ్ముకోలేదు. కరణ్ జోహార్, ఏక్తా కపూర్ కంటే దిల్ రాజు ఎక్కువమంది దర్శకులు, సాంకేతిక నిపుణులను వెలుగులోకి తీసుకొచ్చారు.
గత ఏడాది సిరివెన్నెల సీతారామశాస్త్రికి పద్మశ్రీ ఇచ్చారు. సంతోషం. మరి, ఈ ఏడాది ఎందుకో అన్యాయం జరిగింది. దీనిపై టాలీవుడ్ లో ఎవరూ మాట్లాడడం లేదు. ఎందుకో మరి? తెలుగు సినిమా పరిశ్రమ నుండి పద్మ అవార్డులకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రమూ సిఫారసు చేయలేదా? ఒకవేళ చేసినా కేంద్రం కనికరించలేదా? అనేది తెలియదు. కైకాల సత్యనారాయణకు పద్మ అవార్డు రాలేదు. ఆయనలా అర్హత కలిగినవారు తెలుగులో కొందరు ఉన్నారు. వారికి వచ్చేలా మున్ముందు కృషి చేస్తే మంచిది.
329337 961556I like the way you conduct your posts. Hmm 137390
766899 29816This internet site is genuinely a walk-through for all of the info you wanted about it and didnt know who to question. Glimpse here, and youll definitely discover it. 122220