కరోనా సోకినవారి దగ్గర ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఆ మహమ్మారి ఏదో ఒక విధంగా సోకేస్తోంది. సెకండ్ వేవ్ లో పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు కోవిడ్ రోగుల కారణంగా ఈ మహమ్మారి మరింత వేగంగా ఇతరులకు సోకుతోంది. కరోనాతో కింగ్ కోఠి ఆస్పత్రిలో చేరిన రోగులు.. కొంచెం కోలుకున్న తర్వాత ఆస్పత్రి నుంచి అలా బయటకు షికారుకు వెళ్లి మరీ వస్తున్నారు. పక్కన ఉండే రోగికి చెప్పి అలా బయటకు వెళుతున్నారు. అక్కడ టీ లేదా కాఫీ తాగి కొద్దిసేపు చెట్ల కింద కూర్చుంటున్నారు. ఈ క్రమంలో వారికి సమీపంగా వెళ్లే ఇతరులు వైరస్ కు గురి కావడానికి కారకులవుతున్నారు. ఆస్పత్రి సిబ్బంది సరిగా పర్యవేక్షించడానికే ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కింగ్ కోఠి ఆస్పత్రిలో మొత్తం 350 పడకలు ఉన్నాయి. ఇందులో 50 ఐసీయూ పడకలు, 33 వెంటిలేటర్ పడకలు ఉండగా.. మిగిలినవి ఆక్సిజన్ పడకలు. ఐసీయూలో రోగులు పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించేందుకు వీలుగా ప్రతి ఐదు పడకలకు ఓ వైద్యుడు ఉండాలి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఆస్పత్రి సూపరింటెంట్ సహా మొత్తమ్మీద 28 మంది మాత్రమే వైద్యులు ఉన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్ వంటి చోట్ల కూడా వీరే విధులు నిర్వహిస్తుండటంతో ఐసీయూలో పర్యవేక్షణ కరువైంది. దీంతో రోగులు ఇష్టారాజ్యంగా బయటకు వెళ్లి వస్తున్నారు. ఇది ఇతరులకు ప్రమాదకరంగా మారుతోంది.
190957 133497Greatest fighter toasts ought to entertain and supply prize on your couples. Initially audio system next to obnoxious crowd would be wise to comprehend one particular gold colored strategy as to public speaking, which is private interests self. very best man jokes 926050