కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ లోని నిమ్స్ లో వైద్యులు అక్కడి వాలంటీర్కు వ్యాక్సిన్ కోవాగ్జిన్ తొలి డోస్ ఇచ్చారు. దీంతో వ్యాక్సిన్ తయారీలో మరో ముందడుగు పడినట్టైంది. ఈ మందును ఫార్మా దిగ్గజ కంపెనీ భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తోంది. భారత్ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్), పూణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహాయంతో కోవాగ్జిన్ ను అభివృద్ధి చేస్తోంది.
కోవాగ్జిన్ మొదటి, రెండో దశల్లో క్లినికల్ ట్రయల్స్ కు ఇప్పటికే అనుమతి లభించింది. భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) ఇందుకు అనుమతులు మంజూరు చేసింది. హైదరాబాద్ లోనే ఈ మందును అభివృద్ధి చేస్తున్నారు. భారత్ బయోటెక్ కు చెందిన బయోసేఫ్టీ లెవల్ 3 ప్రయోగశాలలో కోవాగ్జిన్ తయారు చేశారు. భారత్ లోని 12 ఆసుపత్రులను ఎంపిక చేయగా నిమ్స్ కు అవకాశం దక్కింది. నిమ్స్ లో ఇందుకు ప్రత్యేక వార్డు సిద్ధం చేశారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ మందుపై ఈ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే భారత్ లో తక్కువ ధరకే మెడిసిన్ లభించే అవకాశం ఉందంటున్నారు.
126454 382239Thanks for another informative post. Exactly where else could anyone get that kind of info in such a easy to understand way of presentation. 317899
590695 474095I like you weblog (dsol, je suis francais, je parle mal anglais) 995567