కరోనా మానవత్వంను పూర్తిగా చంపేసింది. ఇప్పటికే మనిషికి మనిషికి సంబంధాలు తెంచేసిన కరోనా ఒక వ్యక్తి చనిపోయి రోడ్డు మీద పడి ఉన్నా కూడా జనాలు పట్టించుకునే పరిస్థితి లేదు. నా అన్న వాళ్లు, ఇతరులు ఎవరు కూడా పట్టించుకోక పోవడంతో వ్యాపారి శవం నాలుగు గంటల పాటు రోడ్డు మీదే ఉండాల్సి వచ్చింది. కరోనా వల్ల కాకుండా కరోనా భయంతో అతడు మృతి చెందాడు. గుంటూరు జిల్లాకు చెందిన సత్తెనపల్లి వావిలాలవారి వీధిలో నివాసం ఉండే 60 ఏళ్ల వ్యాపారికి కరోనా నిర్థారణ అయ్యింది.
కరోనా నిర్థారణ అవ్వడంతో పాటు అతడికి శ్వాసకు సంబంధించి ఇబ్బంది ఎదురవ్వడంతో హాస్పిటల్కు వెళ్లేందుకు సిద్దం అయ్యాడు. ఇంటి నుండి బయటకు నడుస్తున్న సమయంలో అతడు అక్కడికి అక్కడే కుప్పకూలి కొన్ని నిమిషాల పాటు విలవిలలాడాడు. ఆ సమయంలో అతడి వద్దకు కరోనా భయంతో ఎవరు వెళ్లలేదు. కొన్ని నిమిషాల తర్వాత అతడు ఊపిరి వదిలాడు. చనిపోయిన తర్వాత కూడా అతడి శవం వద్దకు ఎవరు వెళ్లలేదు. నాలుగు గంటలకు మున్సిపాలిటీ వారు వచ్చి ఆ శవంను తీసుకు వెళ్లి దహనం చేశారు. ఇలాంటి అత్యంత దారుణ సంఘటనలు మానవత్వం ఉందా లేదా అనే అనుమానంను కలిగిస్తుంది.
393849 760132The Case For HIIT Cardio – Why You ought to Concider it By the way you may want to check out this cool site I found 556706
158831 25445Just wanna input which you have a really good web site , I enjoy the pattern it truly stands out. 86067