మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రామచంద్రరెడ్డి కిడ్నాప్ అయ్యాడు. కిడ్నాప్ అయిన రామచంద్రరెడ్డి హత్య కాబడ్డాడు అంటూ పోలీసులు పేర్కొన్నారు. ఒక భూమి వివాదంలో ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని ఎంక్వౌరీ చేస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… జడ్చర్ల మాజీ సింగిల్ విండో చైర్మన్ అయిన రామచంద్రరెడ్డిని షాద్ నగర్ పరిసర ప్రాంతాల్లో అగంతకులు కిడ్నాప్ చేశారు. కొత్తూరు మండలంలోని పెంజర్ల గ్రామం దగ్గర్లో ఆయన్ను చంపేసి పడేశారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం అన్నారం గ్రామంలో ఉన్న ఒక భూ వివాదంలో రెండు వర్గాల మద్య కొన్ని రోజుల క్రితం గొడవ జరిగింది. ఆ సమయంలో రామచంద్రరెడ్డి మరియు ప్రత్యర్థులు ఘర్షణకు దిగినట్లుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు త్వరలోనే హంతకులను పట్టుకుంటామంటూ ప్రకటించారు.
209316 235841Perfectly written subject material , thanks for selective data . 914351
329324 171920That is the first time I frequented your web page and to thispoint? I surprised with the analysis you made to create this actual submit extraordinary. 144900
106335 61920Great data, better still to find out your blog that has an excellent layout. Nicely done 110635