సింహపురి ఎక్స్ప్రెస్, నర్సాపూర్ ఎక్స్ప్రెస్లు.. మొత్తం 37 బోగీలతో ఢిల్లీకి వెళ్ళేందుకు సిద్ధంగా వున్నాయట. అయితే, ఇదంతా పొలిటికల్ వ్యవహారం కావడమే ఇక్కడ కీలకమైన విషయం. సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తున్న ఓ వీడియో, కొన్ని ట్వీట్ల సారాంశాన్ని చూస్తే.. రాష్ట్రంలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అతి త్వరలో భారీ దెబ్బ తగలబోతోందట. వైసీపీ చెందిన దాదాపు 37 మంది కీలక ప్రజా ప్రతినిథులతో బీజేపీ టచ్లోకి వచ్చిందనీ, వారందర్నీ అతి త్వరలో తమవైపుకు తిప్పుకోనుందనేది ఆ ప్రచారం తాలూకు సారాంశం. నిజమేనా.? రాష్ట్రంలో ఆ పరిస్థితులు వున్నాయా.? అంటే, ప్రస్తుతానికైతే లేవని చెప్పగలంగానీ.. తెరవెనుక వ్యవహారాలు మాత్రం కొంత గందరగోళంగా వున్నాయన్నది నిర్వివాదాంశం.
నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పొగపెడుతున్నారన్నది నిర్వివాదాంశం. ‘సింహమే సింగిల్గా వస్తుంది.. పందులే గుంపుగా వస్తాయి..’ అంటూ రఘురామకృష్ణంరాజు పెద్ద బాంబే పేల్చారు. ‘నేను ఎంపీ పదవికి రాజీనామా చేస్తాను.. నాతోపాటు ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలి..’ అని సవాల్ విసిరారాయన కొద్ది రోజుల క్రితం. మరోపక్క, నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి, ‘ఏడాది పాలన పూర్తి చేసుకున్నాం.. కేకులు కట్ చేసి సంబరాలు చేసుకోవడం తప్ప అభివృద్ధి ఏమీ లేదు..’ అని తేల్చేసిన విషయం విదితమే. శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇటీవల ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలూ పెను దుమారం రేపాయి. ఇసుక కుంభకోణం పేరుతో గుంటూరు జిల్లాకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యల దుమారం గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఇవన్నీ బాహాటంగా జరుగుతున్నవే. ఇంత జరుగుతున్నా అధిష్టానం ఎందుకు ఈ ‘అసమ్మతిని’ కంట్రోల్ చేయలేకపోతోంది.? ప్రధానంగా ఇసుక విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది అధికార పార్టీలో.
తాజాగా మంత్రి విశ్వరూప్, తాను నిర్మిస్తోన్న ఓ ఇంటి కోసం ఇసుకని బుక్ చేస్తే, నాణ్యమైన ఇసుక స్థానంలో మట్టితో కూడిన ఇసుక రావడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. ఇళ్ళ స్థలాల విషయంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆరోపణలు ఎదుర్కోవడమే కాదు, కొందరు ప్రజా ప్రతినిథులైతే అధికారుల తీరు మీదా, ప్రభుత్వం తీరుపైనా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే, సింహపురి ఎక్స్ప్రెస్, నర్సాపూర్ ఎక్స్ప్రెస్లు.. మాత్రమే కాదు, మరికొన్ని ఎక్స్ప్రెస్లు కూడా ఢిల్లీ వైపు చూసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదేమో.! ఇప్పటికే టీడీపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులతోపాటు, టీడీపీ వాదనను మీడియాలో సమర్థవంతంగా విన్పించిన పలువురు కీలక నేతల్ని లాగేసిన బీజేపీ, ఇప్పుడు ‘ఆకర్ష’ మంత్రాన్ని వైఎస్సార్సీపీ మీద ప్రయోగించడమే నిజమైతే.. రాష్ట్రంలో పొలిటికల్ ఈక్వేషన్స్ అనూహ్యంగా మారిపోతాయ్. అయితే, రాష్ట్ర ప్రజలు 2019 ఎన్నికల్లో బీజేపీని పూర్తిగా తిరస్కరించిన దరిమిలా, అందులో దూకేంత సాహసం అధికార పార్టీ ప్రజా ప్రతినిథులు చేస్తారా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
564472 426899This really is a great blog. Keep up all the work. I too love to blog. This is wonderful everybody sharing opinions 849365
693851 4542Hi! I discovered your website accidentally today, but am really pleased that we did! Its not only entertaining, but in addition straightforward to make use of in contrast to lots that Ive viewed! 313876
75110 265497This web-site is truly a walk-through rather than the info you desired concerning this and didnt know who to inquire about. Glimpse here, and youll completely discover it. 628729