Switch to English

కాంగ్రెస్-డ్రాగన్ భాయీభాయీ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

మన దేశం మీదకు శత్రువు దండెత్తి వచ్చి దొంగ దెబ్బ తీశాడు. మన సైనికులు వీరోచిత పోరాటం చేసి 20 మంది అమరులయ్యారు. శత్రుదేశపు సైనికులను రెట్టింపు స్థాయిలో హతమార్చారు. సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. మన దేశ సార్వభౌమాధికారాన్ని పొరుగు దేశం సవాల్ చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఏ దేశమైనా ఏం చేస్తుంది? ఏకతాటిపై నిలబడుతుంది. రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తుంది. కానీ మన దగ్గర ఏం జరుగుతోంది? ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీకి సహకరించకపోగా.. పొరుగుదేశానికి ఒత్తాసు పలికేలా మాట్లాడుతోంది. ఈ వ్యవహారంలో రాహుల్ గాంధీ ట్వీట్ల మీద ట్వీట్లతో చెలరేగిపోతున్నారు. చైనాకు లొంగిపోయారని, సరెండర్ మోదీ అంటూ విమర్శలు చేస్తున్నారు. మోదీని చైనా పొగడడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నలు గుప్పిస్తున్నారు.

దీంతో బీజేపీ రంగంలోకి దిగింది. కాంగ్రెస్ కు చెందిన రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (ఆర్ జీఎఫ్) డోనర్లలో చైనా ప్రభుత్వం కూడా ఉందని, చైనా ఎంబసీ నుంచి ఆ సంస్థకు భారీ మొత్తంలో విరాళాలు అందాయని పేర్కొనడం సంచలనం సృష్టించింది. 2005-06లో దాదాపు రూ.90 లక్షలు చైనా ఎంబసీ నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు అందాయని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. ఈ విరాళాల నేపథ్యంలోనే చైనాతో ఉచిత వాణిజ్య ఒప్పందం (ఎఫ్ టీఏ) కుదుర్చుకున్నారని, దీనివల్ల చైనాకు భారీ లబ్ధి చేకూరగా.. భారత్ కు అపార నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. 2007-08లో రాజీవ్ గాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కాంటెపరరీ స్టడీస్ (ఆర్ జీఐసీఎస్)కు చైనా ప్రభుత్వం నుంచి 3 లక్షల డాలర్ల గ్రాంట్ వచ్చిన తర్వాతే చైనాతో ఎఫ్ టీఏ కు అడుగు పడిందనే విషయం తాజాగా వెలుగు చూసింది.

ఇక ఈ విరాళాలు ఇలా కొనసాగుతుండగా.. 2008లో కాంగ్రెస్, చైనా కమ్యూనిస్ట్ పార్టీ మధ్య ఓ ఒప్పందం కుదిరింది. అందులో ఏముంది అనే సంగతి ఎవరికీ తెలియదు. సోనియా, జిన్ పింగ్ సమక్షంలో రాహుల్ గాంధీ, చైనా మంత్రి వాంగ్ జియాలు ఒప్పందంపై సంతకాలు చేశారు. దీనికి సంబంధించిన ఎలాంటి వివరాలనూ కాంగ్రెస్ పార్టీ బయట పెట్టలేదు. నిజానికి కాంగ్రెస్, చైనాల మధ్య బంధం ఈనాటిది కాదు. నెహ్రూ హయాం నుంచే అది కొనసాగుతోంది. హిందీ-చీనీ భాయీభాయీ అనే నినాదంతో చైనాతో చెట్టపట్టాలేసుకున్నారు. అయితే, 1962లో చైనా దురాక్రమణ చేసి తన బుద్ధి చూపించుకుంది. అయినప్పటికీ కాంగ్రెస్, చైనా మధ్య బందం కొనసాగుతూనే వచ్చింది. చైనా కూడా కాంగ్రెస్ అగ్రనేతలు.. ముఖ్యంగా గాంధీ కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది.

2017లో సిక్కిం వద్ద భారత్, చైనా బలగాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పుడు కూడా రాహుల్ గాంధీ రహస్యంగా చైనా రాయబారిని కలవడం విమర్శలకు తావిచ్చింది. అలాగే ఒలింపిక్స్ సందర్భంగా చైనా వెళ్లిన రాహుల్ కు జరిగిన అతిథి మర్యాదలు, మానస సరోవర్ యాత్రకు వెళ్లినప్పుడు డ్రాగన్ అన్నీ తానై ఆయనకు సహకరించిన వైనం ఇప్పుడు ప్రస్తావనకు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో చైనాను పల్లెత్తు మాట అనకుండా మోదీ సర్కారుపై రాహుల్ విమర్శలు చేయడం చైనాతో ఆ పార్టీ బంధాన్ని బలపరుస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా 2008లో కుదిరిన ఒప్పందం ఏమిటి? చైనా నుంచి కాంగ్రెస్ విరాళం ఎందుకు స్వీకరించింది? ఇప్పుడు చైనా పట్ల ఎందుకు మెతక వైఖరి కనబరుస్తోంది తదితర విషయాలపై క్లారిటీ ఇవ్వడం ఆ పార్టీపై ఉంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...