దేశంలో గుణాత్మక మార్పు రావాలని.. రెండు, మూడు నెలల్లో సంచలన వార్త వింటారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. తన పర్యటనలో భాగంగా బెంగళూరు వెళ్లి మాజీ ప్రధాని, జేడీ(ఎస్) అధినేత దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని కలిశారు. అనంతరం ఆయన మాట్లాడారు.
దేవెగౌడ, కుమారస్వామితో జాతీయ రాజకీయాలపై చర్చ జరిగిందని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ మంచినీరు, విద్యుత్, సాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలనలో దేశ ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు
జాతీయస్థాయిలో మార్పు తథ్యమని.. దీనిని ఎవరూ ఆపలేరని అన్నారు. దేశంలో ఎప్పుడూ లేనంతగా రూపాయి విలువ పడిపోవడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. జీడీపీలో భారత్ ను చైనా దాటేసిందని అన్నారు. నిజానికి అమెరికా కంటే బలమైన శక్తిగా ప్రపంచంలో భారత్ ను నిలబెట్టొచ్చని అన్నారు. ఉజ్వల భారత్ కోసం భారతీయులంతా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
790612 66402We may have a hyperlink alternate arrangement between us! 830166
115355 28569The site loading velocity is amazing. 920706