Chiranjeevi: దేశంలో లోక్ సభ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈక్రమంలో 18ఏళ్లు నిండిన యువత కూడా తమ ఓటు వినియోగించుకోనున్నారు. యువతకు ఓటు విలువ, ఓటు వినియోగించుకోవాలని సూచిస్తూ ప్రధాని మోదీ (PM Modi) పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపునందుకున్న మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) సైతం ఓటు విలువ తెలియజేస్తూ.. ప్రజలు, 18ఏళ్లు నిండిన యువత ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
‘మన దేశ 18వ లోక్ సభ ఎలక్షన్లు త్వరలో జరగబోతున్నాయి. మీకు 18 సంవత్సరాల వయస్సు వస్తే మీరు మొట్టమొదటిసారి ఓటు వేసే హక్కు పొందుతారు. మీ మొదటి ఓటు – మనరాష్ట్ర, దేశ భవిష్యత్తు కోసం వినియోగించండి.. తప్పనిసరిగా ఓటు వేయండి !!’ అని అన్నారు.
ఇందుకు యువతకు స్ఫూర్తినిచ్చేలా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన గీతాన్ని పోస్ట్ చేశారు. త్వరలోనే నోటిఫికేషన్ విడుదలై ఎన్నికల షెడ్యూల్ రానుంది. ఏపీలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో యువతకు ఓటు విలువను తెలియజేస్తూ చిరంజీవి పోస్ట్ చేశారు.
మన దేశ 18 వ లోక్ సభ ఎలక్షన్లు
త్వరలో జరగబోతున్నాయి.మీకు 18 సంవత్సరాల వయస్సు వస్తే
మీరు మొట్టమొదటిసారి
ఓటు వేసే హక్కు పొందుతారు.మీ మొదటి ఓటు –
మనరాష్ట్ర, దేశ భవిష్యత్తు కోసం… https://t.co/CUr1ylUWhh pic.twitter.com/bugliSNHYJ— Chiranjeevi Konidela (@KChiruTweets) March 12, 2024