ఇటీవల గాంధీ ఆసుపత్రిలో స్పృహలో ఉండి శస్త్ర చికిత్స చేయించుకున్న వృద్ధురాలిని మెగాస్టార్ చిరంజీవి త్వరలో కలవనున్నారు. మొన్న గురువారం నాడు ఆ వృద్ధురాలిని స్పృహలో ఉంచి ట్యాబ్ లో అడవి దొంగ సినిమా చూపిస్తూ వైద్యులు మెదడులో కణితిని తొలగించిన విషయం తెల్సిందే. ఈ విషయం మెగాస్టార్ చిరంజీవి వరకూ వెళ్ళింది. చిరు వెంటనే స్పందించారు. దీంతో ఆయన శుక్రవారం తన పీఆర్వో ఆనంద్ ను గాంధీ ఆసుపత్రికి పంపి వివరాలు కనుక్కోమన్నారు.
ఆనంద్ గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజారావును కలవగా ఆపరేషన్ లో వైద్య సిబ్బందిని పరిచయం చేసారు. తర్వాత వృద్ధురాలిని కలిసి మాట్లాడారు. తాను చిరంజీవి అభిమానినని, ఆయన సినిమాలు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చూస్తుంటానని ఆవిడ చెప్పడం జరిగింది.
ఆనంద్ అక్కడి నుండే ఈ వివరాలు చిరుకు ఫోన్ లో వివరించగా వీలు చూసుకుని రెండు, మూడు రోజుల్లో గాంధీ ఆసుపత్రికి వచ్చి ఆవిడను కలుస్తానని చిరంజీవి చెప్పారు. చిరంజీవి తన అభిమానులకు ఎంత గౌరవం ఇస్తారో మరోసారి తెలుస్తోంది అనీ.. ఇది కదా ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అంటే.. అని అభిమానులు మెగాస్టార్ వ్యక్తిత్వం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు..
301482 132917Come across back yard garden unusual periods of ones Are typically Weight reduction and every 1 1 might be crucial. One way state could possibly be substantial squandering through the diet. lose weight 147220
893626 681485Hello DropshipDragon provides dropping for quality, affordable products direct from China to your customers. Perfect for eBay sellers and internet site owners alike! 396299