భారత్ తో కయ్యం పెట్టుకుని ఏదో చేయాలనే తహతహతో కదులుతున్న చైనా ఆ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. ప్రపంచం మొత్తం కరోనాతో పోరాడుతుంటే చైనా మాత్రం రాజ్యకాంక్షతో రెచ్చిపోతోంది. ఆసియాలో తమకు బలమైన పోటీగా భావిస్తున్న భారత్ ను దెబ్బ కొట్టేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. మన పొరుగు దేశాలను తనవైపు తిప్పుకునే చర్యలు ముమ్మరం చేసింది. పాకిస్తాన్ ఎప్పటినుంచో ఆ దేశానికి మద్దతుగా ఉండగా.. తాజాగా నేపాల్ ను తన వైపు తిప్పుకుంది. ఇప్పుడు ఆఫ్గనిస్థాన్ ను కూడా దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.
ఇప్పటివరకు తెర వెనుక ప్రయత్నాలు చేసిన డ్రాగన్.. తాజాగా నేరుగా రంగంలోకి దిగింది. పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్, నేపాల్ విదేశాంగ శాఖ మంత్రులతో వర్చువల్ భేటీ ఏర్పాటు చేసింది. కరోనా నియంత్రణకు పరస్పరం సహకరించుకోవాలని అజెండాతో ఈ భేటీ ఏర్పాటు చేసినట్టు ప్రకటించినా.. దీనికి వెనుక రహస్య అజెండా ఉన్నట్టు తెలుస్తోంది. భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో మన పొరుగుదేశాలతో బంధాలు పెంచుకోవడం ద్వారా పైచేయి సాధించాలని చేస్తోంది. ఇందులో భాగంగానే నేపాల్, ఆఫ్గాన్ లతో భేటీ జరిపింది.
తమకు సహకరించే విషయంలో పాక్ ను చూసి నేర్చుకోవాలంటూ ఆ రెండు దేశాలకు హితబోధలు చేసింది. నేపాల్ ప్రధాని ఓలి ఇప్పటికే చైనా చేతిలో కీలుబొమ్మగా మారగా.. తాజాగా ఆఫ్గాన్ ను కూడా తన వైపు తిప్పుకోవాలని డ్రాగన్ యోచిస్తోంది. ఆ దేశానికి ఆర్థికపరమైన సహకారం అందించే పేరుతో దగ్గర కావాలని భావిస్తోంది. అలాగే తాను ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ) ప్రాజెక్టుకు సహకారం కోరినట్టు సమాచారం. మన పొరుగు దేశాలు ఒక్కోటీ చైనా చెంతకు చేరిపోతున్న నేపథ్యంలో భారత్ వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
497873 874516New York Travel Tips […]below youll discover the link to some internet sites that we think you should visit[…] 44496
198009 908863The when I just read a weblog, Im hoping that this doesnt disappoint me approximately this one. Get real, Yes, it was my method to read, but When i thought youd have something intriguing to state. All I hear is actually a number of whining about something which you could fix need to you werent too busy trying to find attention. 932976