రన్ రాజా రన్ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు సుజీత్. పాతికేళ్ళు కూడా నిండని, పెద్దగా సినిమాల్లో అనుభవం కూడా లేని ఒక యువకుడు మంచి ఎంటర్టైనర్ ను అందించడంతో వెతుక్కుంటూ ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం వచ్చింది. రన్ రాజా రన్ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో చేసాడు సుజీత్. అదే బ్యానర్ ప్రభాస్ కు సొంత సంస్థ వంటిది. బాహుబలి తర్వాత ప్రభాస్ యూవీ క్రియేషన్స్ కు అవకాశం ఇవ్వడంతో ప్రభాస్ ను డైరెక్ట్ చేసే అవకాశం సుజీత్ అందుకున్నాడు. సాహోతో ఒక మంచి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించినా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఫెయిల్ అయింది. ఈ నేపథ్యంలో సుజీత్ పై విమర్శలు కూడా వచ్చాయి.
ఇదిలా ఉంటే సాహో ప్లాప్ అయినా కానీ మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అదృష్టం సుజీత్ తలుపు తట్టింది. లూసిఫెర్ రీమేక్ కు సుజీత్ ను తీసుకున్నారు. అయితే సుజీత్ చేసిన మార్పులు చిరుకి అంతగా నచ్చకపోవడంతో లూసిఫెర్ రీమేక్ పనులు ఆగిపోయాయి.
తాజా సమాచారం ప్రకారం సుజీత్ ఇప్పుడు తిరిగి యూవీ క్రియేషన్స్ వద్దకే చేరుకున్నాడట. వారి బ్యానర్ లో సినిమా చేయడానికి సుజీత్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. గోపీచంద్ లేదా శర్వానంద్ లలో ఒకరు హీరోగా నటించే అవకాశాలు ఉన్నాయి. పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
814075 808739Fantastic post, Im searching forward to hear more from you!! 782572
485937 211707It can be difficult to write about this topic. I feel you did an outstanding job though! Thanks for this! 561729