ఎన్నికల సంఘం చేతకానితనానికి శిక్ష తాము అనుభవించాలా? అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. ఎక్కడ చూసినా ఈవీఎంలు మొరాయించిన సంఘటనలు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. గురువారం పోలింగ్ జరిగిన తీరుపై శుక్రవారం మధ్యాహ్నం చంద్రబాబు ఉండవల్లిలో మీడియాతో మాట్లాడారు. చాలాచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పారు.
ఈవీఎంలు పనిచేయకపోతే మరో ఈవీఎంను మార్చారని, ఇందులో విశ్వసనీయత ఎక్కడుందని ప్రశ్నించారు. ఇంత పనికిమాలిన ఈసీని తాను ఇంతవరకు చూడలేదన్నారు. స్వయంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది కూడా తన ఓటు వేసుకోలేకపోయారని గుర్తుచేశారు. నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించాల్సిన ఈసీ.. అలా చేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు. తెలంగాణలో ఏకంగా 25 లక్షల ఓట్లు తొలగించి క్షమాపణ చెప్పారని విమర్శించారు. క్షమాపణ చెబితే సరిపోయే అంశమా ఇది అని ప్రశ్నించారు.
ఈవీఎంలను మానిప్యులేట్ చేయడం సులభమని, ఎవరికి ఓటేస్తే, అది ఎవరికి పడుతుందో దాన్ని రూపొందించిన ప్రోగ్రామర్ కి తప్ప మరెవరికీ తెలియదన్నారు. తన ఓటు కూడా తనకు పడిందో లేదో అని వ్యాఖ్యానించారు. అందుకే తాము బ్యాలెట్ ఎన్నికల కోసం పోరాడుతున్నామని చెప్పారు. తనకు టైమ్ లేకుండా ఎన్నికలు పెట్టి దెబ్బ తీయాలని చూశారని చంద్రబాబు ఆరోపించారు.
గత ఎన్నికల్లో చివరి విడతలో ఎన్నికలు జరగ్గా.. ఈసారి కావాలనే మొదటి విడతలో పెట్టారని విమర్శించారు. ప్రధాని మోదీ చెప్పినట్టే ఎన్నికల సంఘం పనిచేస్తోందని దుయ్యబట్టారు. అసలు ఏ ప్రాతిపదికగా తొలి విడతలో ఎన్నికలు పెట్టారో చెప్పాలన్నారు. పార్టీలతో మాట్లాడారా? లేక లాటరీ వేశారా? అని నిలదీశారు. తన ప్రశ్నలన్నింటికీ ఎన్నికల సంఘం సమాధానం చెప్పాల్సిందేనని స్పష్టంచేశారు.
శనివారం తాను ఢిల్లీ వెళ్తున్నానని, ఎన్నికల సంఘాన్ని కలిసి ఇవన్నీ అడుగుతానని చెప్పారు. తనతోపాటు తన ఎంపీలు, మంత్రులందరినీ తీసుకెళ్తానని పేర్కొన్నారు. సేవ్ డెమొక్రసీ-సేవ్ ఇండియా ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామన్నారు. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద ముందస్తు ప్రణాళిక ప్రకారమే అల్లర్లు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు. ఇవన్నీ అప్పటికప్పుడు జరిగిన దాడులు కావని, అంతా పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగాయన్నారు. అల్లర్లు జరిగే అవకాశం ఉందని తాము ముందుగానే హెచ్చరించామని.. అయినప్పటికీ, పోలీసు ఉన్నతాధికారులను ఈసీ మార్చేసిందని విమర్శించారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్న తాను.. ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ తోపాటు ఆర్థిక నేరగాడు జగన్ తో పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఆయన ఎన్నికలకు మూడు రోజుల ముందు ప్రచారానికి బ్రేక్ ఇచ్చి మరీ లోటస్ పాండ్ లో కుట్రలకు ప్రణాళికలు రచించారని బాబు ఆరోపించారు. నిన్న పోలింగ్ కూడా పూర్తి కాకుండానే లోటస్ పాండ్ కు వెళ్లిపోయారని, ఫలితాల తర్వాత కూడా అక్కడే ఉంటారా అని ప్రశ్నించారు.
కాగా, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, ఓటింగ్ లో పాల్గొనకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. వారంతా కసితో ఓటేశారని చంద్రబాబు అభినందించారు. రాత్రి వరకు క్యూలో ఉండి ఓటేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా శిరస్సు వంచి ధన్యవాదాలు చెబుతున్నానని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో మీరు ఎన్ని సీట్లు గెలుస్తారని అనుకుంటున్నారని ఓ విలేకరి ప్రశ్నించగా.. రేపు మీరే చూస్తారుగా అని బాబు బదులిచ్చారు. గురువారం అర్ధరాత్రి జరిగిన టెలికాన్ఫరెన్స్ లో 130 స్థానాలు గెలుస్తామని చెప్పిన చంద్రబాబు.. తాజాగా మాత్రం సంఖ్య చెప్పకపోవడం గమనార్హం.
76747 151474Glad to be 1 of several visitants on this remarkable web website : D. 928932
65045 457765Hey, you used to write amazing, but the last few posts have been kinda boringK I miss your excellent writings. Past few posts are just a bit out of track! come on! 600293
358265 928042Oh my goodness! an exceptional post dude. Many thanks Nonetheless We are experiencing problem with ur rss . Dont know why Not able to sign up to it. Could there be anybody finding identical rss dilemma? Anyone who knows kindly respond. Thnkx 330362
986801 550423Wow! Thank you! I always wanted to write on my internet site something like that. Can I include a portion of your post to my website? 57149