దేశంలో ఉల్లి రేట్ల హెచ్చు తగ్గులు చాలా కామన్ గా జరుగుతూనే ఉంటాయి. కాని ఇటీవల అనూహ్యంగా రూ.70 నుండి రూ.80 వరకు కిలో ఉల్లి రేటు వెళ్లడంతో సామాన్యులు మద్యతరగతి వారు కుదేలయ్యారు. నెల రోజుల గ్యాప్ లో ఎంటీ ఇంత రేటు పెరుగుదల అంటూ సామాన్యులు తల పట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉల్లిధరను దించేందుకు సిద్దం అయ్యింది. కేంద్రం ఆధీనంలో ఉండే ఉల్లి నిల్వల నుండి తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలకు సూచించింది. రాష్ట్రాలు ఇప్పటికే 8 వేల టన్నుల ఉల్లి గడ్డలు తీసుకున్నట్లుగా కేంద్రం తెలియజేసింది.
కేంద్ర ప్రభుత్వం రూ.25 నుండి రూ.30 మద్య రైతుల నుండి సేకరించింది. ఇప్పుడు అదే రేటుకు రాష్ట్రాలకు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక ఉల్లి నిల్వలపై కూడా ఆంక్షలు విధించింది. వ్యాపారుల వద్ద అనుమతికి మించి ఉల్లి నిల్వలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు.
ఎక్కువ ధరలకు ఉల్లిగడ్డలను అమ్ముతున్నట్లుగా వెళ్లడయితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి లీలా నందన్ పేర్కొన్నారు. దాంతో పండుగ సందర్బంగా ఉల్లి దరలు మద్యతరగతి వారికి అందుబాటులోకి వచ్చేశాయి.
537234 395749Taylor Lautner By the way you might want to take a look at this cool website I found 734294
453160 819943Hello! I simply would like to give a huge thumbs up for the great info youve here on this post. I might be coming back to your weblog for more soon. 613136