ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న గీతం యూనివర్శిటీపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే టీడీపీ నేతలు ఎందుకు గగ్గోలు పెడుతున్నారంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాధ్, ఆదీప్ రాజు టీడీపీ తీరును తప్పుబట్టారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
‘గీతం యూనివర్శిటీ ఆక్రమణలో దాదాపు 40 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. దీనిపై టీడీపీ నేతలు గగ్గోలు పెట్టడం, ఎల్లో మీడియా రచ్చ చేయడం విడ్డూరంగా ఉంది. 800 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకుంటే స్వాధీనం చేసుకోవడం తప్పా..’ అని ప్రశ్నించారు. ‘టీడీపీ కార్యాలయం కూడా ఆక్రమణలోనే ఉంది. భూ అక్రమాలు చేసిన వారికే టీడీపీ పాలిట్ బ్యూరోలో పదవులు దక్కుతున్నాయి’ అని మండిపడ్డారు.
‘గీతం యూనివర్శిటీలో అక్రమాలే ఎక్కువ. గాంధీ పేరుతో అక్కడ జరిగేవన్నీ గాడ్సే పనులే. ఆక్రమణలకు గురైన ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నందుకు ప్రజలు హర్షిస్తున్నారు’ అని పెందుర్తి ఎమ్మెల్యే ఆదీప్ రాజు అన్నారు.
గీతం యూనివర్శిటీ చైర్మన్ శ్రీ భరత్.. హీరో బాలకృష్ణ చిన్న అల్లుడు, టీడీపీ నేత కావడంతో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ చర్యలపై మండిపడ్డారు. దీనిపై వైసీపీ నేతలు స్పందించి టీడీపీ నేతలకు ధీటుగా స్పందించారు. రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ అంశం ఎన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.
469539 982374Chaga mushroom tea leaf is thought-about any adverse health elixir at Spain, Siberia and plenty of n . Countries in europe sadly contains before you go ahead significantly avoidable the main limelight under western culture. Mushroom 587284
463897 633372Deference to web site author , some excellent entropy. 850367
719667 684504You need to take part in a contest for among the very best blogs on the web. I will suggest this internet internet site! 963459