బిగ్ బాస్ సీజన్ 4 చివరి దశకు చేరుకుంది. రేపు జరగనున్న ఫినాలే ఎపిసోడ్ తో బిగ్ బాస్ 4 కు కర్టైన్స్ పడినట్లే. ప్రస్తుతం ఫినాలే ఎపిసోడ్ కోసం బిగ్ బాస్ మానేజ్మెంట్ భారీ హంగులు ఏర్పాటు చేసింది. చాలా మంది స్టార్స్ తమ స్టేజ్ పెరఫార్మన్స్ తో సందడి చేయనున్నారు. ఇక లాస్ట్ ఫైనల్ డిసైడ్ సెగ్మెంట్ కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రానున్న విషయం తెల్సిందే.
ఇక బిగ్ బాస్ కు సంబంధించి ఎప్పటికప్పుడు ఫీలర్లు అందుతున్నాయి. దీని ప్రకారంగా ఈరోజు హౌజ్ లో రెండు ఎలిమినేషన్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హౌజ్ లో ఐదుగురు ఉన్నారు. వీరందరూ ఫైనలిస్ట్స్. అభిజీత్, అఖిల్, సోహైల్, అరియనా, హారికలు ఈ సీజన్ ఫైనల్స్ కు చేరుకున్నారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈరోజు రెండు ఎలిమినేషన్స్ కు సంబంధించిన ఎపిసోడ్స్ ను చిత్రీకరించబోతున్నారట. మొదటి ఎలిమినేషన్ కు చీఫ్ గెస్ట్స్ గా అనిల్ రావిపూడి, మెహ్రీన్ విచ్చేస్తారని సమాచారం. ఇక రెండో ఎలిమినేషన్ కు లక్ష్మీ రాయ్, ప్రణీత సుభాష్ లు సందడి చేయనున్నారు. అయితే ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది.
బయట ఉన్న ట్రెండ్స్ బట్టి హారిక, అఖిల్ లకు డేంజర్ ఉంది.