ప్రపంచంలోనే పాపులర్ గేమ్ పబ్జీకి ఎంతమంది బానిసలుగా మారిపోయారో అనేక వార్తలు చూశాం. గేమ్ మాయలో పడి దేశాల బోర్డరే దాటేశాడో యువకుడు. పబ్జీ ఆడుతూ ఇద్దరు స్నేహితులు కొట్టుకున్నారు. ఓ బాలుడు గేమ్ ఆడుతూ ఎటెళ్లిపోయాడో అంతు తెలీలేదు. పబ్జీ గేమ్ అదే పనిగా ఆడొద్దన్న తండ్రిని దారుణంగా చంపేశాడో యువకుడు. గేమ్ ఆడుతూ పిచ్చోళ్లైపోయారు కొందరు. పబ్జీతో ఇన్ని అరాచకాలు జరుగుతున్నా ఇంకా ఆ మాయ నుంచి బయటపడలేక పోతున్నారు కొందరు.
ఇటువంటి దారణ సంఘటనే విశాఖ జిల్లాలో జరిగింది. అరకులోయ ప్రాంతానికి చెందిన కౌశిక్ రోజూ అదే పనిగా మొబైల్ లో పబ్జీ ఆడుతున్నాడు. ఈ గేమ్ బానిసైపోయిన కౌశిక్ ఒక్కసారిగా అరుపులు అరుస్తూ.. పిచ్చిగా ప్రవర్తించాడు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు స్థానిక ఏరియా ఆస్పత్రిలో చూపించారు. బాలుడ్ని విశాఖ తీసుకెళ్లాలని సూచించగా తీసుకెళ్లారు. అక్కడ జరిపిన పరిక్షల అనంతరం.. పబ్జీకి బానిస కావడంతో కౌశిక్ మతిస్థిమితం కోల్పోయాడని చెప్పారు డాక్టర్లు.
దీంతో దేశవ్యాప్తంగా ఈ గేమ్ కు బానిసై.. బలైపోయిన వారిలో కౌశిక్ కూడా చేరిపోయాడు. పబ్జీ గేమ్ ను బ్యాన్ చేయాలని డిమాండ్లు ఉన్నా సాకారం కావటం లేదు. పిల్లలే కాకుండా యువకులు కూడా ఈ గేమ్ కు బానిసలైపోతున్నారు. తల్లిదండ్రులు పిల్లలకు మొబైల్స్ ఇచ్చేప్పుడు కనిపెట్టుకుని ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
392614 199250quite nice post, i really really like this internet website, maintain on it 406749
197209 422721 Nice post. I learn something a lot more challenging on different blogs everyday. It will always be stimulating to read content material from other writers and practice a little something from their store. Id prefer to use some with the content on my blog whether you dont mind. Natually Ill give you a link on your internet blog. Thanks for sharing. 232686