బాహుబలి నుండి సినిమాలు పూర్తి చేయడంలో ప్రభాస్ చాలా నెమ్మదిస్తున్నాడు. బాహుబలి అంటే రాజమౌళి సినిమా కాబట్టి ఆ మాత్రం సమయం పట్టినా దానికి తగ్గ న్యాయం జరిగిపోతుంది కాబట్టి అభిమానులు ఊరుకున్నారు. దానికి తగ్గట్లే బాహుబలి ప్రభాస్ అభిమానులను గర్వపడేలా చేసింది. అయితే ఇదే ఆలస్యం ప్రభాస్ మిగతా సినిమాలకు కూడా జరుగుతుండడం అభిమానులను కలవరపెడుతోంది. ఏడాదికి కనీసం ఒక్క సినిమా కూడా చేయకుండా రెండేళ్లకు పైగా ఒక్కొక్క సినిమాకు తీసుకుంటుండడం వారికి నచ్చట్లేదు. ప్రభాస్ ఎంతగా ప్రయత్నిస్తున్నా ఎందుకనో ఈ విషయంలో మాత్రం సెట్ అవ్వట్లేదు.
బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సాహో చిత్రానికి దాదాపు రెండున్నరేళ్లు పట్టింది. ఆ సినిమా రిజల్ట్ ఎలాంటిదో అందరం చూసాం. ఇక ఇప్పుడు చేస్తున్న రాధా కృష్ణ కుమార్ సినిమాకు కూడా ఆలస్యం తప్పట్లేదు. ఇప్పుడంటే కరోనా కాబట్టి అర్ధం చేసుకోవచ్చు కానీ మాములుగా కూడా ఈ ప్రాజెక్ట్ మొదలై రెండేళ్లు కావొస్తున్నా ఇంకా సరైన అప్డేట్ ఏదీ లేకపోవడం అభిమానులను కలవరపెట్టేదే.
తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు షూటింగ్ లు తిరిగి ప్రారంభించడానికి అనుమతులు ఇవ్వడంతో ప్రభాస్ 20వ సినిమాపై మళ్ళీ వార్తలు మొదలయ్యాయి. వీలైనంత తొందరగా సినిమాను మొదలుపెట్టి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను ఫినిష్ చేయాలని టీమ్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే ప్రభాస్ మాత్రం ఈ విషయంలో కంగారు వద్దంటున్నాడట. అసలు షూటింగ్ లు మొదలయ్యాక పరిస్థితులు ఎలా ఉంటాయో చూసి అప్పుడు రంగంలోకి దిగడం బెస్ట్ అంటున్నాడట. అప్పటిదాకా తన టీమ్ ను వెయిట్ చేయమని చెప్పినట్లు సమాచారం.
849138 939803It is onerous to search out knowledgeable individuals on this subject, nevertheless you sound like you already know what you are talking about! Thanks 243997
491088 756668Following examine a couple of of the weblog posts on your website now, and I in fact like your way of blogging. I bookmarked it to my bookmark site list and shall be checking once again soon. Pls try my site online as effectively and let me know what you think. 315261