MLC Elections: ఆంధ్రప్రదేశ్లో అంతే.! ఎన్నికలంటే చాలు, ఫేక్ ఓటర్లు పుట్టుకొచ్చేస్తారు. తండ్రి పేరు తెలియని ఓటర్లు.. భర్త పేరు తెలియని ఓటర్లు.. ఇలా పెద్ద కథే కనిపిస్తుంటుంది. రాత్రికి రాత్రి ఫేక్ ఓటర్లను ఎలా తీసుకొస్తుంటారు.? అన్నది ఓ మిలియన్ డాలర్ క్వశ్చన్గా మారిపోతోంది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక నేపథ్యంలో చోటు చేసుకున్న ‘ఫేక్ ఓటర్ల’ సిత్రం చూసేశాం కదా.!
తాజాగా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకి(MLC Elections) సంబంధించి కూడా ఫేక్ ఓటర్లు రంగంలోకి దిగారు. పట్టభద్రులే ఈ ఎన్నిక కోసం ఓటెయ్యాల్సి వుంటుంది. కానీ, కనీస విద్యార్హత లేనివారిని ఓటర్లుగా చూపిస్తూ.. చిత్రమైన డ్రామా నడుస్తోంది. పుట్టుకొస్తున్న ఈ ఫేక్ ఓటర్ల వ్యవహారంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు పోటెత్తుతున్నాయి.
గతంలో ఏ తిరుపతిలో అయితే లోక్ సభ ఉప ఎన్నిక సందర్భంగా ఫేక్ ఓటర్లు పుట్టుకొచ్చారో, అక్కడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నిమిత్తం పదుల సంఖ్యలో ఫేక్ ఓటర్లను సృష్టించడం గమనార్హం. ఎన్నకలన్న ప్రతిసారీ, ఇలాంటి వైపరీత్యాలు చోటు చేసుకుంటున్నా.. కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు స్పందించాల్సిన రీతిలో స్పందించడం లేదన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
అసలంటూ ప్రజాస్వామ్యం మనుగడ సాధిస్తుందని ఒప్పుకోవాలంటేనే, ఎన్నికల వ్యవస్థ సక్రమంగా నడవాలి. ఆ పరిస్థితే కనిపించడంలేదిప్పుడు. మరెలా మనం ప్రజాస్వామ్యంలో వున్నామని చెప్పగలిగేది.? ఓటుకి 3 వేల నుంచి.. అవసరమైతే ముప్ఫయ్ వేలు ఇచ్చేదాకా అయినా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు దిగజారిపోతున్న వైనం చూస్తున్నాం.
ఎమ్మెల్సీ ఎన్నికల వేళ, ఓటు విలువ భారీగా పెరిగింది. ఎంత రేటు అయినా పెట్టి కొనేసేవారు కొందరు.. భయభ్రాంతులకు గురిచేసి ఓట్లేయించుకునేవారు ఇంకొందరు. మరో రకం.. ఇదిగో ఇలా, బోగస్ ఓటర్లను తయారు చేయడం. నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.? మరి ఈ తరహా అక్రమాలకు ముగింపు ఎప్పుడు.?
72244 922001What a lovely weblog. Ill definitely be back. Please preserve writing! 805945