Switch to English

మహా డ్రామా.. తెలుగు రాష్ట్రాలపై బీజేపీలో డైలమా

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టి దూకుడైన నిర్ణయాలతో దూసుకుపోతున్న బీజేపీకి మహారాష్ట్రలో ఝలక్ తగిలింది. బలమున్నా, లేకున్నా రాష్ట్రాల్లో కాషాయ జెండా రెపరెపలాడించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న కమలనాథుల దూకుడుకు బ్రేక్ పడింది. ఈ పరిణామం కాషాయదళానికి ఇబ్బందిగా మారగా.. పలు ప్రాంతీయ పార్టీలకు మాత్రం ఎనలేని ఉత్సహాన్నిచ్చింది.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల సీఎంలకు మహారాష్ట్ర పరిణామాలు సానుకూలంగా మారాయి. ఉత్తరాదిలో మాత్రమే పట్టున్న బీజేపీ.. దక్షిణాదిన కర్ణాటక దాటి కూడా విస్తరించాలని ప్రణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై పట్టు సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందుకు సంబంధించి తెర వెనుక గట్టిగానే వ్యూహాలు పన్నుతోంది. ఇతర పార్టీ నేతలను చేర్చుకోవడం ద్వారా బలపడాలని భావిస్తూ ఆ దిశగా ముందుకెళ్తోంది.

తెలంగాణలో నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకోవడంతో ఇక్కడ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని యోచిస్తోంది. ఇందుకు అధికార పార్టీని ఇబ్బంది పెట్టి రాష్ట్రంలో పాగా వేయాలన్నది ఆ పార్టీ ప్రణాళికగా చెబుతున్నారు. మహారాష్ట్రలో ఫడ్నవిస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ స్పందిస్తూ.. రాష్ట్రంలోనూ అలాంటి పొలిటికల్ సర్జికల్ స్ట్రైక్స్ ఉంటాయని వ్యాఖ్యానించడమే అందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు.

ఇక ఏపీలో ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న కేసులను అడ్డం పెట్టుకుని లాభపడాలన్నది బీజేపీ యోచన అని తెలుస్తోంది. జగన్ బెయిల్ రద్దు చేసి ఆయన్ను జైలుకు పంపడం ద్వారా పార్టీని కకావికలు చేసి, ఆ స్థానంలోకి తాము వెళ్లాలన్నది కమలనాధుల కుయుక్తులు అని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో మహారాష్ట్రలో దెబ్బతిన్న బీజేపీ తెలుగు రాష్ట్రాలపై కాస్త వేచి చూసే ధోరణి అవలంభించాలని భావించే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

మహారాష్ట్ర రాజకీయ క్రీడలో పరువు పోగొట్టుకున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలపై ప్రస్తుతం ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడకపోవచ్చని చెబుతున్నారు. ఒకవేళ కాదని మొండిగా ముందుకెళితే బీజేపీపై జనంలో వ్యతిరేకత ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. దీంతో బీజేపీ నుంచి తెలుగు రాష్ట్రాల అధినేతలకు ప్రస్తుతానికి ముప్పు తప్పినట్టే అనిపిస్తోంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

రాజకీయం

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎక్కువ చదివినవి

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...