మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు ఎలా మారిపోతాయో చెప్పడం చాలా కష్టం. ఈ విషయం ఇప్పుడు కాదు.. 39 సంవత్సరాల క్రితమే కమల్ హాసన్ ఊహించి చెప్పారు. అదే అప్పుడు జరిగింది. ఇప్పుడు జరుగుతూనే ఉన్నది. ఎప్పుడు ఎవరు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటారో ఎవరికీ తెలియదు. బీజేపీని కాదని శివసేన బయటకు వెళ్ళింది. బయటకు వెళ్లిన శివసేన పార్టీ ఎన్సీపీ, కాంగ్రెస్ తో చేతులు కలిపింది.
ఈ మూడు పార్టీల మధ్య సయోధ్య కుదిరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. బీజేపీ వ్యూహం మహారాష్ట్రలో ఫెయిల్ అయ్యింది సరే. ఇప్పుడు బంతి మహా వికాస్ అఘాడి కోర్టులో ఉన్నది కాబట్టి బీజేపీ సైలెంట్ గా ఉన్నది. అంతమాత్రం చేత ఓడిపోయింది అనుకుంటే ఎలా ఉంటుంది.
గతంలో ఇండియా పై పాక్ దుండగులు దాడులు చేసి ఇబ్బందులు పెట్టినపుడు.. దానికి వ్యతిరేకంగా ఇండియా సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. దానికి మోడీ ఓ సింబల్ పెట్టి హౌ ఈజ్ జోష్ అని చెప్పేవారు. ఇప్పుడు అదే స్టైల్ లో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ హౌస్ ఈజ్ జోష్ అంటూ బీజేపీని ఉద్దేశించి శివసేన పోస్ట్ చేసింది.
ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. బీజేపీ సైలెంట్ గా ఉన్నప్పుడు శివసేన ఇలాంటి పోస్టులు చేస్తూ రెచ్చగొట్టడం మంచిది కాదని శివసేన నేతలు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం ఇప్పుడు ఆ పార్టీలోనే చాలామందికి నచ్చడం లేదు. బహిరంగంగా చెప్పకపోయినా లోలోపల ఇలానే అనుకుంటున్నారు.
631775 843833What other people have stated and in some uncommon cases, suicide might occur. 934122