Switch to English

బీజేపీ ఆలస్యం.. టిడిపి,జనసేనకి అమృతమా? విషమా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

మరి కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకి తెలుగుదేశం, జనసేన, బీజేపీ జట్టుగా వెళ్తున్నాయి. ఎన్నికలని పురస్కరించుకొని వైసీపీ నాలుగు రోజుల క్రితమే 175 అసెంబ్లీ స్థానాలకి 24 పార్లమెంటు స్థానాలకి అభ్యర్థులను ప్రకటించేసింది. కూటమి పార్టీలు మాత్రం ఇంకా అభ్యర్థులను పూర్తిస్థాయిలో ప్రకటించలేదు. జనసేన, టీడీపీ పోటీ చేస్తున్న సీట్లని కొన్ని బీజేపీ కావాలనుకోవడమే ఇందుకు కారణమని అంటున్నారు.

పొత్తుల్లో భాగంగా కమలం పార్టీకి 10 అసెంబ్లీ, ఆరు పార్లమెంటు స్థానాలను కేటాయించారు. జనసేనకి 21 అసెంబ్లీ, రెండు పార్లమెంటు సీట్లను ఇచ్చారు. ఇక మిగిలిన 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాల నుంచి టీడీపీ బరిలోకి దిగుతోంది. తమకి కేటాయించిన రెండు పార్లమెంటు స్థానాల్లో ఒకటైన కాకినాడ నుంచి తంగేళ్ల శ్రీనివాస్ పోటీ చేస్తారంటూ జనసేనాని ప్రకటించారు. సైకిల్ పార్టీ మాత్రం అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు. బీజేపీ వైఖరి ఇందుకు కారణమట.

జనసేన, టీడీపీ లకు కేటాయించిన సీట్లలో కొన్ని తమకు కేటాయించమని కాషాయం పార్టీ అడుగుతోందట. ఉత్తరాంధ్రలో అనకాపల్లి, విజయనగరం పార్లమెంటు స్థానాలని బీజేపీ కి ఇవ్వాలని భావించగా వాటికి బదులుగా విశాఖపట్నం, అమలాపురం పార్లమెంటు స్థానాలను కేటాయించమని పట్టు పడుతోందట.

అదేవిధంగా టీడీపీ, జనసేనకి కేటాయించిన అనపర్తి, పాడేరు, ఆదోని, గుంటూరు వెస్ట్, శ్రీకాళహస్తి, కదిరి సీట్లు తమకే కావాలంటూ బీజేపీ అడుగుతుండటంతో మిగిలిన రెండు పార్టీల అభ్యర్థుల ప్రకటన ఆలస్యమవుతోందట. అభ్యర్థులను ఖరారు చేయడానికి ఆ పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఇటీవలే ఢిల్లీకి వెళ్లారు. ఆ పార్టీ పెద్దలను కలిసి ఇప్పటికే ఖరారు చేసిన అభ్యర్థుల పేర్లను కూడా అధిష్టానానికి సమర్పించినట్లు సమాచారం.

అయితే ఈ తంతు మొత్తం కొలిక్కి రాకపోవడంతో టీడీపీ, జనసేన పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించలేకపోతోంది. మరోవైపు వైసిపి అభ్యర్థులను ప్రకటించేసి ప్రచారంలో దూసుకెళ్తుంటే.. ఈ రెండు పార్టీల అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో పార్టీ నేతలు అయోమయంలో పడ్డారు. ఇది ఎన్నికల ఫలితం పై ప్రభావం చూపుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

ఎక్కువ చదివినవి

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్ పర్సనాలిటీ. నిత్యం సినిమాలతో బిజీ. పరిశ్రమ...

Vote: ఓటు గొప్పదనం ఇదే..! ఒక్క ఓటరు కోసం 18కి.మీ అడవి బాట.. ఎక్కడంటే..

Vote: ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ (Elections 2024) ఫీవర్ నడుస్తోంది. ఈక్రమంలో మొదటి విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో నిన్న ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కు...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...