బిగ్ బాస్ ఓటిటి వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ నిన్నటితో పూర్తయింది. మొత్తం ఏడుగురు ఫైనలిస్ట్ లలో చివరికి అఖిల్, బిందు మాధవి మధ్య టైటిల్ పోరు జరగ్గా అందులో బిందు మాధవి విజేతగా నిలిచింది. అఖిల్ సార్థక్ మరోసారి రన్నరప్ గానే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
బిగ్ బాస్ గత ఐదు సీజన్లలో పురుషులే విజేతలుగా నిలిచిన విషయం తెల్సిందే. దీంతో మహిళ విజేత అవ్వాలన్న కోరిక చాలా మందిలో కలిగింది. అది బిందు మాధవికి ప్లస్ అయిందని చెప్పొచ్చు. మొదటి నుండి ఆడ పులిగా బిందు మాధవి గుర్తింపు తెచ్చుకుంది.
టాప్ 7లో బాబా భాస్కర్, అనిల్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యాక టాప్ 5గా మిత్రా గేమ్ నుండి బయటకు వచ్చింది. ఇక 10 లక్షలు తీసుకుని అరియనా కూడా బయటకు రావడంతో టాప్ 3 గా బిందు మాధవి, శివ, అఖిల్ లు నిలిచారు. శివ థర్డ్ ప్లేస్ లో నిలిచాడు.
555171 712121hi was just seeing in the event you minded a comment. i like your web site and the thme you picked is awesome. I will probably be back. 459767