కరోనా అంతమైనట్టు కాదని.. భవిష్యత్తులో మరిన్ని వైరస్ లు దాడి చేయొచ్చని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. బయో ఆసియా-2022 అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. వర్చువల్ విధానంలో జరిగిన ఈ సదస్సులో తెలంగాణ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈక్రమంలో రెండేళ్లుగా ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకున్న కరోనా, దేశాలు ఎదుర్కొన్న తదనంతర పరిణామాలు, ఆరోగ్యం, వ్యాక్సినేషన్ తోపాటు పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా గేట్స్ మాట్లాడుతూ..
‘కరోనా సమయంలో ప్రపంచం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. భారత్ వేగంగా స్పందించింది. వ్యాక్సిన్లు తయారు చేసింది.. ధరలు కూడా అందుబాటులో ఉంచింది’ అని అన్నారు. భవిష్యత్తులో పరిణామాలు ఎలా ఉంటాయనే మంత్రి కేటీఆర్ ప్రశ్నకు బదులిస్తూ.. ‘కరోనాతో ప్రపంచ దేశాలు అల్లాడిపోయాయి. ప్రస్తుతానికి తీవ్రత తగ్గినా భవిష్యత్తులో మరిన్ని వైరస్ లు దాడి చేసే అవకాశం ఉంది. శాస్త్రవేత్తలు మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉంది. ఇక్కడితో ఆగిపోకూడదు’ అని అన్నారు.
Live: Fireside chat with @BillGates at the 19th edition of #BioAsia2022 https://t.co/WJL666xJKF
— KTR (@KTRTRS) February 24, 2022
843614 742013Basically wanna input that you have a quite nice internet site , I enjoy the pattern it truly stands out. 338432