బిగ్ బాస్ రియాల్టీ ఏడో సీజన్లో ఇప్పటివరకు రెండు ఎలిమినేషన్లు జరిగాయ్.! నిజానికి, ఈ సీజన్కి సంబంధించినంతవరకు ఎలిమినేట్ అయిపోయిన ఆ ఇద్దరు కంటెస్టెంట్లు మాత్రమే, పరమ వీక్.! మిగతా కంటెస్టెంట్లంతా సూపర్ స్ట్రాంగ్.! గత సీజన్లలో కనిపించని ప్రత్యేకత ఇది.!
కాగా, హౌస్లో ఇప్పటివరకు సందీప్, శివాజీలకు మాత్రమే హౌస్ మేట్స్గా అవకాశం దక్కింది. మిగతావాళ్ళు, బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు గెలిచి, ఆ హోదా దక్కించుకోవాల్సి వుంటుంది. లేకపోతే, ఆ హోదా దక్కకుండానే హౌస్ నుంచి ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదేమో.!
ఇదిలా వుంటే, ఈ సీజన్లో స్టన్నింగ్ కంటెస్టెంట్గా గుర్తింపు తెచ్చుకున్న రతిక ఇమేజ్ అనూహ్యంగా పడిపోయింది. హోస్ట్ నాగార్జున, గడచిన వీకెండ్ ఎపిసోడ్స్లో రతికని లైట్ తీసుకున్నాడు. లైవ్ స్ట్రీమింగ్లో కూడా రతిక స్క్రీన్ స్పేస్ అంతకు ముందుతో పోల్చితే తగ్గడం ఆశ్చర్యకరం.
అదే సమయంలో, పల్లవి ప్రశాంత్ రేంజ్ పెరుగుతోంది. హోస్ట్ అక్కినేని నాగార్జున, స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు పల్లవి ప్రశాంత్ని. పదే పదే ‘రైతు బిడ్డ’ అంటూ పల్లవి ప్రశాంత్ గురించి ప్రస్తావిస్తున్నాడు నాగ్. మిగతా కంటెస్టెంట్లూ, అది కొనసాగించాల్సి వస్తోంది.
హౌస్లో పరిస్థితులు ఇలా వుంటే, పల్లవి ప్రశాంత్ తరపున పీఆర్ టీమ్స్ యాక్టివ్ అవుతున్నాయి. ఈ టీమ్స్ ఒకింత భిన్నంగా పల్లవి ప్రశాంత్ ఇమేజ్ని వేరే లెవల్కి తీసుకెళుతున్నాయి. ఓటింగ్లో కూడా, పెయిడ్ ఓటింగ్స్ పల్లవి ప్రశాంత్ తరఫున గట్టిగా జరుగుతున్నాయట. గత సీజన్లలోనూ ఇలా జరిగినా, పల్లవి ప్రశాంత్ విషయంలో ఇలా జరగడం ఒకింత అనూహ్యం.
బయట ఓటింగ్ సరళిపై హౌస్లో వున్నవారికి లీకులు అందుతున్నాయా.? లేదంటే, హోస్ట్ నాగార్జున మాటల్ని అనాలసిస్ చేసుకుంటున్నారా.? ఏమోగానీ, పల్లవి ప్రశాంత్ విషయంలో కంటెస్టెంట్లు ఒకరొకరుగా జాగ్రత్త పడటం మొదలు పెట్టారు.