దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు నేడు మొదటి దశ జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మొత్తం 30 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 294 స్థానాలకు గాను మొదటి దశలో 30 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతుంది. ఉదయానే పోలింగ్ ప్రారంభం అయ్యింది. ఒకటి రెండు చోట్ల ఈవీఎంలు మొరాయించడం వల్ల కాస్త ఆలస్యం అయ్యింది.
ఈ 30 స్థానాల్లో కూడా అన్ని పార్టీల అభ్యర్థులు కలిసి 191 మంది ఉన్నట్లుగా చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్లో మొత్తం 8 విడుదతల ఎన్నికలు జరుగబోతున్నాయి. నేడు మొదటి విడత సాయంత్రంకు ముగియబోతుంది. ఇంత భారీ ఎత్తున ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అధికార తృణముల్ మరియు విపక్ష బీజేపీలు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. నెల రోజుల పాటు పోలింగ్ జరుగుతూనే ఉండబోతుంది.
305335 729168IE nonetheless is the marketplace leader and a huge component of folks will omit your great writing due to this problem. 263697