తమ అభ్యర్థిని గెలిపించుకోవడం మీద శ్రద్ధ పెట్టాల్సిన అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మీద అమితమైన అభిమానాన్ని చాటేసుకుంటోంది. రత్నప్రభ మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రదర్శిస్తోన్న సానుభూతి అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ కూడా ఆరోపణలు ఎదుర్కొన్న విషయం విదితమే. బహుశా అందువల్లేనేమో వైసీపీ, రత్నప్రభ విషయంలో కొంత ’సానుకూల ధోరణి‘తో వ్యవహరిస్తోంది. ఆమెకు ఉచిత సలహాలు కూడా ఇచ్చేస్తోంది.
కర్నాటకలో రత్నప్రభకు పదవులు ఇవ్వని బీజేపీ, తిరుపతి ఉప ఎన్నిక బరిలో ఆమెను నిలిపి బలిపశువుని చేస్తోందంటూ వైసీపీ నేతలు, వైసీపీ అను‘కుల’ మీడియాలో కార్చుతున్న మొసలికన్నీరు అంతా ఇంతా కాధు. అక్కడికేదో రత్నప్రభను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ఆహ్వానించి, ఆమెకు ఇంతకు ముందు గొప్పగొప్ప పదవుల్ని వైసీపీ కట్టబెట్టేసినట్టుంది పరిస్థితి. రత్నప్రభకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పట్ల అమితమైన అభిమానం వుండేది ఒకప్పుడు. ఆ అభిమానంతోనే, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు కూడా.
కానీ, రాజకీయాల్లో నిన్నటి మాట ఈ రోజు వుంటుందని ఎలా అనుకోగలం.? తిట్టినోళ్ళు పొగుడుతారు, పొగిడినోళ్ళు తిడతారు.. సమయాన్ని బట్టి అన్నీ మారిపోతాయి. సరే, తిరుపతి ఉప ఎన్నికలో రత్నప్రభ అభ్యర్థిత్వం బీజేపీకి కలిసొస్తుందా.? లేదా.? అన్నది వేరే చర్చ. ఈ విషయంలో బీజేపీ – వైసీపీ మధ్య స్పష్టమైన అవగాహన వుందన్న విమర్శలూ వినిపిస్తున్నాయనుకోండి.. ఇలాంటివన్నీ రాజకీయాల్లో మామూలే. ఏపీ మాజీ చీఫ్ సెక్రెటరీ నీలం సాహ్నీకి తాము రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి ఇచ్చి గౌరవించామనీ, బీజేపీ.. రత్నప్రభను బలిపశువుని చేస్తోందని పాపం వైసీపీ ఇంతలా వాపోవడం ఎందుకట.?
15692 731469I like this weblog its a master peace ! Glad I detected this on google . 897980
81012 426882Respect to internet site author , some great entropy. 37667