తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన హేమంత్ పరువు హత్యపై పోలీసులు స్పీడ్ గా విచారణ చేస్తున్నారు. హేమంత్ చనిపోయిన రోజు అంతకు ముందు జరిగిన పరిణామాల గురించి అవంతి తండ్రి మరియు ఇతర కుటుంబ సభ్యులను గచ్చిబౌలీ పోలీసులు విచారించారు. జైల్లో ఉన్న అవంతి తండ్రి లక్ష్మారెడ్డి మరియు మేనమామ యుగందర్రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సందర్బంగా లక్ష్మారెడ్డి ఏమాత్రం పశ్చాతాపం లేకుండా మాట్లాడటం అందరికి ఆశ్చర్యంగా అనిపించింది.
పోలీసుల విచారణలో లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రేమ విషయం తెలిసి అవంతిని ఎంతగానో కట్టడి చేసేందుకు ప్రయత్నించాం. అయినా కూడా తను మా మాట వినకుండా పారిపోయింది. పెళ్లి చేసుకున్న విషయం పోలీసుల ద్వారా తెలియడంతో పాటు కాలనీలో తల ఎత్తుకోలేక పోయాం. పరువు పోయిందనే బాధతో 15 ఏళ్లుగా మాట్లాడని బావమరిది యుగందర్తో మాట్లాడాను అంటూ హత్య విషయమై లక్ష్మారెడ్డి తనకు ఉన్న కోపాన్ని చెప్పుకొచ్చాడు. లక్ష్మారెడ్డి కుటుంబం నుండి తనకు ప్రాణ హాని ఉంది అంటూ అవంతి పోలీసుల ముందుకు వెళ్లింది. ఆమెకు భద్రత కల్పిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.
649725 633260Hey, are you having issues along with your hosting? I required to refresh the page about million times to get the page to load. Just saying 525567
65567 794254Hello there, just became alert to your weblog through Google, and found that it is truly informative. Im gonna watch out for brussels. I will appreciate in the event you continue this in future. Plenty of folks will probably be benefited from your writing. Cheers! xrumer 117143