తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు కింద పడ్డాడు. శ్రీకాకులం లో బాపూజీ కళామందిర్ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో హాజరు అయిన సందర్బంగా సీటుపై కూర్చుంటున్న సమయంలో అనూహ్యంగా ఆయన కిందకు ఒరిగారు. ఆయన కింద పడి పోవడంతో వెంటనే అప్రమత్తం అయిన సిబ్బంది ఆయన్ను లేపారు. ఆ సమయంలో అచ్చెన్న పక్కన్న రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు.
స్వాతంత్య్ర సమరయోధుడు గౌతు లచ్చన్న స్మారక పోస్టల్ ఆవిష్కరణ సందర్బంగా ఈ సంఘటన జరిగింది. ఇదే కార్యక్రమంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ కూడా పాల్గొన్నారు. ఎంపీ రామ్మోహన్ కూర్చుని ఉన్న సోఫాలో అచ్చెన్న ఒక్కసారిగా కూర్చోవడంతో సోఫా వెనక్కు ఒరిగినట్లయ్యింది. అచ్చెన్న మరియు రామ్మోహన్ లు ఇద్దరు కూడా కింద పడబోయారు. వెనుక సిబ్బంది ఉండటం వల్ల ప్రమాదం ఏమీ జరగలేదు.