కృష్ణా నదికి వచ్చిన వరదల్లో అమరావతి మునిగిపోలేదుగానీ, అధికార పార్టీ రాజకీయ బురదలో మాత్రం అమరావతి మునిగిపోయింది. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పుడే అమరావతి మునిగిపోయింది. రాజధాని అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం. కానీ, ఇప్పుడు ఆ అమరావతికే గౌరవం లేకుండా పోయిందాయె. అమరావతిని పట్టించుకోవడంలేదు సరికదా, ఆ అమరావతి ఇమేజ్ని సర్వనాశనం చేయడానికి అధికార పార్టీ నేతలు చెయ్యని ప్రయత్నమంటూ లేదు.
సాక్షాత్తూ మంత్రిగారే అమరావతి గాలి తీసేశారు. మరోపక్క, అధికార పార్టీ అత్యంత వ్యూహాత్మకంగా దోనకొండ వైపు చూస్తోంది. ‘అమరావతి మునిగిపోయింది’ అని మంత్రి బొత్స ప్రకటన చేశాక, ‘ప్రభుత్వంలో రాజధానిపై చర్చ జరుగుతోంది’ అని ఆయన చెప్పాక, దోనకొండలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. రాత్రికి రాత్రి దోనకొండ భూముల ధరలు ఆకాశాన్నంటేశాయి. ఎకరం 20 లక్షలు కూడా లేని దోనకొండ భూములు ఇప్పుడు కోటికి చేరువయ్యాయి.
ఆరు కిలోమీటర్ల దూరంలో నీటి కాలువ వుంది.. రైల్వే లైన్ వుంది.. బ్రిటిష్ హయాంలో ఎయిర్పోర్ట్ కూడా వుండేది.. అంటూ దోనకొండ గురించి అధికార పార్టీ నేతలు చెబుతుండడం గమనార్హం. మరోపక్క, తాగడానికి నీళ్ళు లేక అలమటిస్తున్నామంటూ దోనకొండ వాసులు కన్నీరు పెట్టుకుంటున్నారు కూడా. నిజానికి, 2014కి ముందే దోనకొండ పేరు రాజధాని విషయమై తెరపైకొచ్చింది. అదీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కారణంగానే.
అప్పట్లోనే వైసీపీ నేతలు పెద్దయెత్తున దోనకొండలో భూములు కొన్నారు. టీడీపీ అప్పట్లో అధికారంలోకి రావడంతో వైసీపీ పప్పులుడకలేదు. అఫ్కోర్స్ అమరావతి పేరుతో టీడీపీ నేతలు బాగానే లాభపడ్డారనుకోండి.. అది వేరే సంగతి. ఇప్పుడు దోనకొండ పేరుతో లాభపడేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారన్నమాట. అమరావతి మునిగింది.. దోనకొండ పైకి లేస్తుందా.? లేపినట్టే లేపి, అమరావతిని ముంచేసినట్టు.. దోనకొండని కూడా ముంచేస్తారా.? వేచి చూడాల్సిందే.
907258 642392There is noticeably a bundle comprehend this. I suppose you produced specific good points in functions also. 434908