ఆంధ్రప్రదేశ్ లో ఈవీఎంల మొరాయింపులు, హింసాత్మక సంఘటనలతో గురువారం అర్ధరాత్రికి పోలింగ్ ముగిసింది. ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైపోయింది. వాటన్నింటికీ సీల్ వేసి స్ట్రాంగ్ రూములకు తరలించేశారు. గత మూడు వారాలుగా ప్రచారాలు, వ్యూహాలు, ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ క్షణం తీరిక లేకుండా పార్టీలకు కాస్త సమయం చిక్కింది. ఇక తమకు ఎన్ని ఓట్టు పడ్డాయి? ప్రత్యర్థికి ఎన్ని వచ్చాయి? గెలుపు ఎవరిది? ప్రభుత్వం ఏర్పాటు చేసేది ఎవరు వంటి అంచనాలు, ఊహాగానాలు, లెక్కలు వేసుకోవడంలో బిజీ అయిపోయాయి.ఇందుకు సంబంధించిన సమాచారాన్ని క్షేత్రస్థాయి నుంచి తెప్పించుకుని మదింపు చేసుకుంటున్నాయి. వాస్తవానికి గెలుపు ఎవరిది? ప్రజలు ఎవరికి జైకొట్టారు. చంద్రబాబుకే మరోసారి పట్టం కట్టారా? లేక జగన్ కు ఓ అవకాశం ఇచ్చారా? పవన్ పరిస్థితి ఏంటి? ఓసారి చూద్దాం.
ఈసారి ఎన్నికలను అధికార, ప్రతిపక్ష పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే ఇరుపక్షాలూ తమ తమ వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. పాదయాత్ర ద్వారా జనాల్లో ఉంటూ జగన్ దూసుకుపోగా.. సంక్షేమ పథకాల అమలుతో చంద్రబాబు ప్రజల ఆదరణ పొందడానికి ప్రయత్నించారు. అయితే, ఈసారి ఎన్నికలు చాలా భిన్నమైన వాతావరణంలో జరిగాయి. గతంలో నెమ్మదిగా పోలింగ్ ప్రారంభమై పుంజుకుని, మధ్యాహ్నానికి కాస్త తగ్గి, మళ్లీ సాయంత్రానికి పెరిగేది. ఈసారి మాత్రం ఉదయం 6.30 గంటల నుంచే ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. కానీ చాలాచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో కొద్దిసేపు వేచిచూశారు. ఎంతకీ అవి సరికాకపోవడంతో వెనుతిరిగి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో 11 గంటల సమయానికి చాలా తక్కువ పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నానికి కాస్త పుంజుకుని, సాయంత్రానికి మళ్లీ ఓటర్లు బారులు తీరారు. 6 గంటల సమయానికి పెద్ద సంఖ్యలో జనం పోటెత్తారు. దీంతో అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగింది.
వాస్తవానికి ఒకసారి వెనుతిరిగి వెళ్లిన తర్వాత మళ్లీ పోలింగ్ కేంద్రానికి రావడానికి ఓటరు అంతగా ఆసక్తి చూపించడు. కానీ ఈసారి వారు చాలా కసిగా ఉన్నట్టు కనిపించింది. అందువల్లే ఎలాగైనా ఓటు హక్కు వినియోగించుకోవాలనే తపనతో ఎంత రాత్రైనా వేచి ఉండి ఓటేశారు. దీంతో ఇదంతా ప్రభుత్వ వ్యతిరేకతకు చిహ్నమని, ఈ ప్రభుత్వం పడిపోవాలనే కసితోనే ఓటరు మీట నొక్కారని ప్రతిపక్ష నేతలు అంచనా వేసుకుంటున్నారు. తమ గెలుపు పక్కా అని, భారీ మెజార్టీతో తాము గెలుపొందడం ఖాయమని పేర్కొంటున్నారు.
మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతలు పోలింగ్ సరళిపై తొలుత ఆందోళన చెంది, ఈవీఎంలపై ఆరోపణలు చేశారు. రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. సాయంత్రానికి సీన్ మారినట్టుగా భావించి తమ గెలుపు ఖాయమనే నిర్ధారణకు వచ్చారు. పోలింగ్ శాతం పెరగడం తమకే లాభమని, తెలంగాణలో ఇటీవల భారీ స్థాయిలో నమోదైన పోలింగ్.. అధికార పార్టీకే లాభించిన సంగతి గుర్తుచేస్తున్నారు. అందువల్ల అధికారం తమదేనని ధీమాగా ఉన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. మే 23 తర్వాత మంచిరోజు చూసుకుని ప్రమాణ స్వీకారం చేస్తానని కూడా వ్యాఖ్యానించారు. ఇలా ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండటంతో అసలు వాస్తవం ఏమిటనే దానిపై జనాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
రాయలసీమతోపాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వైఎస్సార్ సీపీ హవా ఉండగా.. కృష్ణాతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో టీడీపీ పైచేయి సాధించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఉభయ గోదావరి జిల్లాల నాడి మాత్రం పట్టుకోవడం కష్టంగా ఉందని అంటున్నారు. ఈ రెండు జిల్లాల్లో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వారే అధికారం చేపడతారు. ఈ నేపథ్యంల ఈ రెండు జిల్లాల ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. పలు అంతర్గత సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ లో వైఎస్సార్ సీపీ హవా కనిపించిందని చెబుతున్నారు. ఏపీ ఇంటెలిజెన్స్ సర్వే కూడా హోరాహోరా పోరు ఉందని తేల్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అసలు విజేత ఎవరనేది తెలియాలంటే మే 23 వరకు వేచి చూడాల్సిందే.
691953 535536Definitely value bookmarking for revisiting. I wonder how much effort you put to create the sort of fantastic informative web site. 281586
281275 639252This web website is actually a walk-through for all with the info you wanted about this and didnt know who to ask. Glimpse here, and youll certainly discover it. 783069