మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఏడాది పాటు డేట్స్ ఇచ్చేసిన చరణ్ ఆ తరువాతి సినిమా ను కూడా లైన్ లో పెట్టాడట ? చరణ్ నెక్స్ట్ సినిమా వంశీ పైడిపల్లి తో ఉంటుందంటూ వార్తలు వస్తున్నాయి. వంశీ పైడిపల్లి ప్రస్తుతం మహేష్ బాబుతో మహర్షి సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 9న విడుదల కానుంది.
తాజాగా చరణ్ నెక్స్ట్ సినిమా మళ్ళీ వంశీ పైడిపల్లితో ఉంటుందంటూ మెగా వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇదివరకే వచ్చిన ఎవడు సంచలన విజయం సాధించింది. దాంతో మరో సినిమా వంశీతో చేయడానికి అప్పుడే చరణ్ ఆసక్తి చూపించాడు. అందులో భాగంగా అటు చరణ్ కోసం కూడా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న వంశీ పైడిపల్లి అతనికి ఓ లైన్ కూడా చెప్పి ఒప్పించాడని టాక్. లైన్ నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయమని అడిగాడట.
రామ్ చరణ్ నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ఎలాగూ చాలా టైం పట్టేలాగుంది కాబట్టి .. ఈ మధ్యలో వంశీ సినిమాను కూడా పూర్తీ చేయాలన్న ఆలోచనలో చరణ్ ఉన్నాడని టాక్. ట్రిపుల్ ఆర్ సినిమా 2020 జులై 30 లో విడుదల అవుతుంది. అంటే దాదాపు ఏడాది కాలంపాటి చరణ్ సినిమా రాదనే టెన్షన్ అటు మెగా ఫాన్స్ లో ఉండడంతో మధ్యలో ట్రిపుల్ ఆర్ తో పాటు వంశీ సినిమా కూడా పూర్తీ చేస్తే వచ్చే సంక్రాంతికి విడుదల చేయొచ్చన్న ఆలోచన ఉండొచ్చు. టెక్నీకల్ డైరెక్టర్ గా ఇమేజ్ తెచ్చుకున్న దర్శకుడు వంశీ ఫోకస్ మహర్షి తరువాత చరణ్ సినిమా పై పెట్టనున్నాడు.
849586 269813You really really should experience a tournament for starters of the finest blogs online. Let me recommend this excellent web site! 431822