Switch to English

ఒట్టు నమ్మండి.! ఆంధ్రప్రదేశ్ అప్పులు తక్కువే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిదే అగ్రస్థానమంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దేశం అప్పులు చేస్తోంది. రాష్ట్రాలూ అప్పులు చేస్తున్నాయి. కోవిడ్ పాండమిక్ అనేది ఓ కుంటి సాకు మాత్రమే. అడ్డగోలుగా అప్పులు చేయడంలో రాష్ట్రాలతో కేంద్రమూ పోటీ పడుతోంది. తాము తెచ్చిన సంస్కరణల్ని ఆయా రాష్ట్రాలు అమలు చేస్తే, అదనంగా అప్పులు చేసుకునేందుకు ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తోంది కేంద్రం.

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, రాష్ట్రాలూ అలాగే దేశం కూడా అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. పెట్రో పన్నులు ఏ స్థాయిలో వున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇవి కాకుండా ప్రతినెలా ఏదో ఒక రూపంలో సామాన్యుడి మీద కేంద్రం భారం వేస్తూనే వుంది. చెత్త పన్ను పేరుతో రాష్ట్రాలు జనాన్ని పీల్చి పిప్పి చేస్తున్న వైనం కళ్ళ ముందుకు కనిపిస్తూనే వుంది.

ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరుగుతున్నాయి.. విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయి. ప్రతి నెలా సామాన్యుడి బడ్జెట్ అంచనాలకు మించి పెరిగిపోతోంటే, ‘ఆల్ ఈజ్ వెల్..’ అని రాష్ట్రాలూ, కేంద్రం చెబుతుండడం గమనార్హం. ఇంతా జరుగుతున్నా సామాన్యుడి బతుకు ఎదుగూ బొదుగూ లేకుండా పోతోంది. ఆ స్థాయిలో రాష్ట్రాలు, కేంద్రం సామాన్యుడ్ని బాదేస్తున్నాయన్నది నిర్వివాదాంశం.

ఆంధ్రప్రదేశ్ అప్పుల విషయానికొస్తే, ఇందులో దాపరికమేమీ లేదు. అప్పులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఏ నెల ఎంత అప్పులు చేస్తున్నదీ, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగానే వెల్లడిస్తోంది. ఆర్థిక మంత్రి, రాష్ట్రంలో వుండడం కంటే దేశ రాజధాని ఢిల్లీలోనే ఎక్కువగా వుండడం చూస్తున్నాం. కొత్త అప్పుల కోసం ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం.. అన్నట్టుంది రాష్ట్ర ఆర్థిక మంత్రి పరిస్థితి.

అయినాగానీ, ఆల్ ఈజ్ వెల్.. దేశంలో చాలా రాష్ట్రాలతో పోల్చితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిమితికి లోబడి అప్పలు చేస్తోందట. అలాగని కాగ్ చెప్పిందంటూ వైసీపీ ప్రచారం చేసుకుంటోంది. వేరే రాష్ట్రాలు అప్పులు చేస్తే, అక్కడ అభివృద్ధి వుంది.. తీర్చగలిగే శక్తి కూడా వుండొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ.? సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప.

రాజధాని లేని రాష్ట్రంలో అభివృద్ధి ఎలా.? చేస్తున్న అప్పుల్లో పదో వందు.. కాదు కాదు, కనీసం ఒకటో వంతు అయినా, రాష్ట్ర రాజధాని మీద పెడితే.. ఎంతో కొంత ఆర్థిక ప్రగతి రాష్ట్రానికి సాధ్యమవుతుంది కదా.?

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Anand Mahindra: ‘గర్వంగా ఉంది..’ నాగ్ అశ్విన్ పై ఆనంద్ మహీంద్రా...

Anand Mahindra: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) తెరకెక్కించిన సినిమా కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). ఇటివలే ప్రభాస్...

బెంగళూరు రేవ్ పార్టీ.. టాలీవుడ్ నటి హేమకి పాజిటివ్

గత నాలుగు రోజులుగా హాట్ టాపిక్ ఆ మారిన బెంగళూరు రేవ్ పార్టీ చీకటి కోణాన్ని బెంగళూరు పోలీసులు బయటపెట్టారు. ఈ పార్టీలో పాల్గొన్న వారికి...

Nagarjuna: ‘మనం’ @10..! తండ్రి విషయంలో భావోద్వేగమైన నాగార్జున

Nagarjuna: తెలుగు చిత్ర పరిశ్రమ లెజండరీ హీరోల్లో ఒకరు అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao). ఆయన ఆఖరి మజిలీగా తెరకెక్కిన సినిమా ‘మనం’ (Manam)....

Prabhas: ‘ఇదే నా బుజ్జి..’ కల్కి 2898 AD ఈవెంట్లో పరిచయం...

Prabhas: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). జూన్...

Pawan Kalyan: చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ‘స్వామినాయుడు’కు జనసేనాని అభినందనలు

Pawan Kalyan: అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడును జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభినందించారు. ఏపీ ఎన్నికల సమయంలో పిఠాపురంలో విస్తృతంగా...

రాజకీయం

అంబటి రాంబాబు రీ-పోలింగ్ గోల.!

మంత్రి అంబటి రాంబాబు, సత్తెనపల్లిలో ఓడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. వాస్తవానికి, ఆయన గెలిచే అవకాశం లేదు కాబట్టి, సత్తెనపల్లిలో వేరే అభ్యర్థిని పెట్టాలని వైసీపీ అధినాయకత్వం తొలుత భావించింది. కానీ, అంబటి రాంబాబు...

తప్పు చెయ్యనప్పుడు ‘పిల్లి’లా ఎందుకు పారిపోవాలి.?

వైసీసీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తన సొంత నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా ఈవీఎంని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడున్నారో...

Janasena: NRI జనసైనికుల ఉదారత.. అగ్నిప్రమాద భాదితులకు ఆర్ధిక సాయం

Janasena: సేవ, సాయం చేయడంలో జనసైన నేతలు, జనసైనికులు ఎప్పుడూ ముందే ఉంటారని మాజీ స్పీకర్, అవనిగడ్డ నియోజకవర్గ జనసేన (Janasena) ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఇటివల అగ్నిప్రమాదంలో సర్వం...

Kodali Nani: వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి అస్వస్థత..

Kodali Nani: మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) అస్వస్థతకు గురయ్యారు. గురువారం గుడివాడలోని తన స్వగృహంలో నందివాడ వైసీపీ నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. వారితో మాట్లాడుతూండగానే...

పిన్నెల్లి ఎక్కడ? హైదరాబాద్ లో ఉన్నారా? తమిళనాడుకు పారిపోయారా?

'మంచివాడు, సౌమ్యుడు, గెలిపిస్తే మీకు మంచే చేస్తాడు' ఇవీ మాచర్ల నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని పరిచయం చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న మాటలు. ప్రచార సభలో దాదాపుగా...

ఎక్కువ చదివినవి

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

డిఫెన్స్ అకాడమీలో ఉద్యోగం.. రూ. లక్షకు పైగా జీతం

దేశ రక్షణలో భాగస్వాములు కావాలని ఆశించే యువతకి నేషనల్ డిఫెన్స్ అకాడమీ గోల్డెన్ ఛాన్స్ ఇస్తోంది. యూపీఎస్సీ ద్వారా ఏడాదికి రెండుసార్లు ఎన్డిఏ అండ్ ఎన్ఏ పరీక్షను నిర్వహిస్తోంది. డిఫెన్స్ అకాడమీ కి...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

పిన్నెల్లి ఎక్కడ? హైదరాబాద్ లో ఉన్నారా? తమిళనాడుకు పారిపోయారా?

'మంచివాడు, సౌమ్యుడు, గెలిపిస్తే మీకు మంచే చేస్తాడు' ఇవీ మాచర్ల నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని పరిచయం చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న మాటలు. ప్రచార సభలో దాదాపుగా...