ఏపీలో కరోనా నిర్థారణ పరీక్షలు లక్షల్లో జరుగుతున్నాయి. ప్రతి రోజు 25 వేల నుండి 35 వేల వరకు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపుగా 11.4 లక్షల మంది శాంపిల్స్ను ఆరోగ్య శాఖ స్వీకరించింది. ఒక్కో శాంపిల్ స్వీకరించి టెస్టు నిర్వహించేందుకు దాదాపుగా 1100 రూపాయలు అవుతుంది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అత్యధికంగా పరీక్షలు నిర్వహిస్తుంటే కింది స్థాయి అధికారులు మాత్రం అలసత్వం కారణంగా కరోనా నిర్థరణ పరీక్షల శాంపిల్స్ వృథా అవుతున్నాయి. అలా ఒకరు మృతి చెందినట్లుగా స్వయంగా అధికారులు ప్రకటించారు.
ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు ఏకంగా 27 వేల శాంపిల్స్ వృథా అయినట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. సరైన నెంబర్స్ వేయక పోవడం, రక్త నమూనాకు మూత సరిగా పెట్టకపోవడం, ల్యాబ్కు సరైన సమయంలో చేరవేయక పోవడం వంటి కారణంగా ఆ శాంపిల్స్ అన్ని కూడా వృథా అయ్యాయి.
కేవలం ప్రకాశం జిల్లాలో మాత్రమే కాకుండా రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా కొన్ని పరిస్థితుల కారణంగా శాంపిల్స్ వృథా అయినట్లుగా అనధికారిక సమాచారం అందుతోంది. ఒక ఆరోగ్య శాఖ అధికారి అంచనా ప్రకారం దాదాపుగా 50 వేల శాంపిల్స్ వృథా అయ్యి ఉంటాయట. ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచిస్తూ ఉంటే కింది స్థాయి వారి సమన్వయ లోపం కారణంగా కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది.
96157 926747I dont leave a lot of comments on plenty of blogs each week but i felt i had to here. A hard-hitting post. 2402
562250 160341I conceive this web site holds some real superb information for everybody : D. 826761
262226 105548As far as me being a member here, I wasnt aware that I was a member for any days, in fact. When the article was published I received a notification, so that I could participate within the discussion of the post, That would explain me stumbuling upon this post. But were definitely all members within the world of concepts. 953962
120062 577407Id forever want to be update on new posts on this web site , bookmarked ! . 882581