బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె తన హాట్ వీడియోలు మరియు ఫొటోలతో ఎప్పుడు సందడి చేసే ఈ అమ్మడు ఈ లాక్ డౌన్ టైమ్లోనే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ప్రకటించింది. నిశ్చితార్థం అయినట్లుగా ఫొటోలు కూడా పెట్టింది. పెద్దల సమక్షంలో ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. సెప్టెంబర్ 1వ తారీకున పూనమ్ పాండే మరియు సామ్ బాంబేలు పెళ్లి చేసుకున్నారు. కొత్త జీవితంను హాయిగా గడుపుతున్నారు అనుకుంటున్న సమయంలో గోవాలోని ఒక పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షం అయిన పూనమ్ పాండే తన భర్త వేదిస్తున్నాడు అని లైంగికంగా మరియు శారీరకంగా అతడి చేస్తున్న వేదింపులను తట్టుకోలేక పోతున్నాను అంటూ ఫిర్యాదులో పేర్కొంది.
పోలీసులకు ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. సెప్టెంబర్ 1వ తారీకున నేను సామ్ బాంబేను వివాహం చేసుకున్నాను. అతడితో షూటింగ్ నిమిత్తం గోవాకు వచ్చాను. సామ్ నాతోనే ఉంటున్నాడు. అతడు గత రెండు మూడు రోజులుగా నన్ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాడు. నన్ను చంపేందుకు బెదిరించడంతో పాటు వేదింపులకు పాల్పడుతున్నాడు. అతడి ప్రవర్తన నాకు చాలా భయంకరంగా అనిపిస్తుందని అతడి వల్ల నాకు ప్రమాదం ఉందంటూ పోలీసులకు తెలియజేసింది. సోమవారం రాత్రి సమయంలో పోలీసు స్టేషన్కు వెళ్లి పూనం ఫిర్యాదు ఇవ్వడం చర్చనీయాంశం అయ్యింది.
నేడు ఉదయం పూనం పాండే భర్త సామ్ బాంబేను పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు. ప్రేమ వివాహం చేసుకన్న ఈ జంట కేవలం మూడు వారాల్లోనే ఇలా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది ఏంటో. పెళ్లి అయ్యి కేవలం మూడు వారాలే అయిన నేపథ్యంలో వీరిద్దరు కలిసి ఉండే అవకాశం ఉందా లేదా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయమై ఇప్పటి వరకు పూనం పాండే అధికారికంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. ఆమెతో మాట్లాడేందుకు జాతీయ మీడియా ప్రయత్నాలు చేస్తోంది. కాని ఆమె గోవాలో ఉన్న కారణంగా సాధ్యం అవ్వలేదు. త్వరలోనే ఆమె అసలు విషయాన్ని మీడియా ముందుకు వచ్చి చెబుతుందేమో చూద్దాం.
609252 779156Excellently written write-up, doubts all bloggers offered exactly the same content because you, the internet is really a greater location. Please maintain it up! 351368
822518 555357Great artical, I unfortunately had some difficulties printing this artcle out, The print formating looks a little screwed over, something you may want to look into. 773571