Switch to English

కొనసాగుతున్న కొడాలి దుమారం: ఈసారి మోడీపై తీవ్ర వ్యాఖ్యలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

మంత్రి కొడాలి నాని, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారా.? లేదంటే, వ్యతిరేకంగా పనిచేస్తున్నారా.? వైఎస్‌ జగన్‌ పట్ల అమితమైన ప్రేమాభిమానాల్ని ప్రదర్శిస్తూనే.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని వెనకేసుకొస్తూనే.. ఓ వైపు ప్రభుత్వాన్ని, ఇంకో వైపు పార్టీని భ్రష్టుపట్టించేందుకు వ్యూహాత్మకంగా ‘రాజకీయం’ చేస్తున్నారా.? ఇలా సవాలక్ష ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి.

గత కొద్ది రోజులుగా ఆయన హిందూ దేవాలయాలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ని వెనకేసుకొస్తూనే, వైసీపీని, వైసీపీ ప్రభుత్వాన్నీ ఇరకాటంలో పడేస్తున్నారాయన. కొడాలి నాని వ్యాఖ్యల నేపథ్యంలోనే ‘తిరుమలలో అన్యమతస్తుల డిక్లరేషన్‌’ వివాదం మరింత ముదిరి పాకాన పడింది.

‘ఆంజనేయస్వామి చెయ్యి విరగ్గొడితే నష్టమేంటి.? అది బొమ్మే కదా.! అంతర్వేది రధం దగ్ధమైతే నష్టమేంటి, ఇన్స్యూరెన్స్‌ వస్తుందిగా..’ అంటూ వెకిలి వ్యాఖ్యలు చేసిన కొడాలి, ఇప్పుడు ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్‌గా చేసుకున్నారు. ‘ప్రధాని మోడీని ఆయన భార్యతో కలిసి అయోధ్య రామ మందిరంలో పూజలు చేయమని బీజేపీ నేతలు చెప్పండి.. ఆ తర్వాత వైఎస్‌ జగన్‌, తన సతీమణితో కలిసి వెంకటేశ్వరస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించాలని డిమాండ్‌ చేయండి..’ అంటూ కొడాలి నాని తాజాగా చేసిన వ్యాఖ్యలు బీజేపీకి మరింత ఆగ్రహం తెప్పిస్తున్నాయి.

తిరుమల విషయంలోనూ, ఇతరత్రా విషయాల్లోనూ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి వున్నానంటున్నారాయన. అన్నట్టు, హిందూ మతాన్ని రెండు కులాలకు పరిమితం చేసే కుట్ర జరుగుతోందంటూ కొడాలి నాని సంచలన విమర్శలు చేసిన విషయం విదితమే. నోటికొచ్చిన బూతులు మాట్లాడటంలో కొడాలి నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడాయన పనిగట్టుకుని హిందూమతంపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం కొత్త అనుమానాలకు తెరలేపుతోందని బీజేపీ సహా వివిధ పార్టీలకు చెందిన నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

‘విగ్రహాన్ని బొమ్మగా చూసేవాడు హిందువే కాడు..’ అంటూ పరిపూర్ణానందస్వామి కొడాలి నాని వ్యాఖ్యలపై ఈ రోజు తీవ్రంగా స్పందించిన విషయం విదితమే. ఏదిఏమైనా, రాష్ట్రంలో ఓ పద్ధతి ప్రకారం హిందూ సమాజంపై దాడి జరుగుతోంది.. హిందూ దేవాలయాలే లక్ష్యంగా నడుస్తున్న ఈ కుట్ర.. రాష్ట్రంలో అశాంతికి కారణమవుతోంది. దురదృష్టవశాత్తూ అధికార పార్టీ నేతలు ఈ అగ్నికి ఆజ్యం పోస్తున్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎక్కువ చదివినవి

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ రివీల్

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. నూతన దర్శకుడు...

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి...

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...